పిల్లల తెలివి



ఐదవ తరగతి చదువుతున్న సరోజిని పదేళ్ళ కొడుకు దినేష్‌ బక్కచిక్కి మందకొడిగా వుండటం చూసి సరోజినికి ఎప్పడూ దిగులుగా వుండేది. భోజనం కూడా సరిగ్గా చేయక పోవడం వల్ల మరింత దిగులుగా వుండేది. తన కొడుకు అందరి పిల్లల్లాగా తెలివిగా చురుకుగా వుండాలని ఎవరెవరి సలహాల మీదనో ఏవేవో టానిక్కులు, మందులు తెచ్చి ఇచ్చేది.

ఒకసారి ఎవరో ఇచ్చిన సలహా ప్రకారం బలవర్ధకమైన కాయగూరలు, ఆకుకూరలు వండి భోజనంలో వడ్డించి పెట్టింది. వాటిని చూసిన దినేవ్‌ "ఈ ఉడకేసిన కూరలు నేను తిననంటే తినను. నాకు ఇష్టం లేదంతే!” అని ఖచ్చితంగా చెప్పేశాడు.

సరోజిని కొడుకుతో “చూడు బాబూ! ఇప్పడు నువ్వు ఐదోతరగతి చదువుతున్నావు ఈ కాయగూరలు, ఆకుకూరలు ఎటువంటి ఆరోగ్యాన్నిస్తాయో నీకు తెలీదు. వచ్చే సంవత్సరం ఆరోతరగతికి వెళ్తే మీ టీచర్‌ ఆరోగ్యశాస్త్రంలో వీటి విలువ చెబుతుంది. అది విని నువ్వే ఆశ్చర్యపోతావు!" అంది.

తల్లితో “అమ్మా! వచ్చే సంవత్సరం నేను టీచర్‌ ద్వారా తెలుసుకుని అప్పడు తింటాను ఇప్పుడు మాత్రం ప్రతిరోజూ వంటలు టీవీలో పిండివంటలలో ఆంటీలు చేసినట్లుగా నాకిష్టమైన వంటలు చేసి పెట్లు!” అన్నాడు దినేష్‌,

నరోజిని ఈ కాలం పిల్లలందరిలాగే తన కొడుక్కి కూడా ఇంత తెలివితేటలు వచ్చాయా?

అనుకుని నిర్హాంతపోయింది.

Responsive Footer with Logo and Social Media