జయప్రకాష్ నారాయణ్
జననం
బాబూ హరసూదయాల్, పూలరాణి, కాయస్థ దంపతులకు విజయ దేేశమి పర్వదినాన తేది.11 అక్టోబర్ 1902 నాడు జయప్రకాశనారాయణ్ జన్మిం చాడు. ఆ తల్లి దండ్రుల ఆనందానికి అంతులేదు. మద్దెల మోతలతో, ఆనంద గీతాలతో వారిల్లు మార్ర్కోగిపోయింది కొన్ని రోజులు,
గుండ్రని తెల్ల ని ముఖం, నల్లని ఉంగరాల ఒత్తయిన 'వెంట్రుకలు, విశాలమయిన నుదురు, ప్రకాశవంతమయిన చైతన్యంతో ఆ శిశువు ఎంతో అంద ముగా ఉన్నాడు. వయసు పెరిగినకొలది ఆ బాబు అందం పెరుగుతూ కన్నవారి ఆనందాన్ని ఇనుమడింప జేశాడు.
నవ్వు ముఖంతో ఎప్పుడూ ప్రసన్నంగా 'కన్పించేవాడే కాని ఏనాడూ ఏడ్వలేదు.మంచం పైనుండి దొరలి కిందపడిన కూడా, బాబు మూగవాడవుతా " డేమోనని తల్లి పూలరాణి భయపడసాగింది. తండ్రి కూడా బాధపడ్డాడు. మూగ కాదు.యోగ సమాధిలో ఉన్నట్లుంది పాప పరిస్థితి. అది చూసి 'ముసలయ్యా' అని పిలిచేది తల్లి , అదే బాబును అందరు పిలిచే ముద్దుల పేరయ్యింది.
ప్రాథమిక విద్యాభ్యాసం
అయిదెండ్లు రాగానే బాబును బడికి పంపించారు. అన్నాళ్ళు ని(దించి ఉన్న అతని బుద్ధి వికసించసాగింది. చదువులోని ఆసక్తి బాలుని చురుకుదనాన్ని బహిర్గత పరిచింది. ఒకనాడు జయప్రకాశ విద్యాగురువు వారింటికి వచ్చి ఇలా ప్రశంసించాడు.
“ఈ బాబు విద్యలో తప్పక పేరు గడిస్తాడు. ఏ విషయమైనా చాలు ఒకసారి వింటే అతనికి కంఠస్థమైపోతుంది. ఒకసారి అతని పలకమీద వ్రాస్తేచాలు ఇక అది అతని మెదడులో నిలిచిపోతుంది. ఇంత చురుకయిన బుద్ధి- శ్రద్ధకల అబ్బాయిని నేనింతవరకు చూడలేదు, ఇతన్ని 'మూగ- ముసలయ్య” అనేదెవరు?”
ఆ తల్లి దండ్రులకు గురువు మాటలు అమిత ఆనందాన్ని కలిగించాయి, ఊళ్ళో వారందరూ జయ్యపకాశ్ చురుకుతనాన్ని గూర్చి క్రొత్తగా చెప్పుకోసాగారు.
జన్మస్థలం - పూర్వీకులు
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సరిహద్దులు కలిసే చోట 'దియారా' అనే ప్రదేశం ఉంది. దాని నాలుగు ప్రక్కలూ నీరే వ్యాపించి ఉంది. అక్కడి జనాభా 25000 - 30,000 మధ్య ఉంటుంది. అందులోని ఒక పల్లెటూరు లాలాటోలీ, అక్కడ ఎక్కువ స్థూలాకాయస్తులుఎక్కువ
బాబూ 'దేవకినందనలాల్ది ఆ పళ్లెలో పేరున్న కుటుంబం, ఆయన పోలీస్ 'డాక్టర్ ” ఉద్యోగం చేసేవాడు. కవిగా గుర్రంపై కూర్చుని స్వారీచేస్తూ పోతుంటే గ్రామస్థులందరూ గౌరవంతో ప్రక్కకు తప్పుకొని దారి ' వదిళేవారు.
ఆయనకు వయసు మళ్ళిన దశతో కలిగిన ఏకైక పుత్రుడు హరిసూ దయాల్. యోగ్యుడైన తండ్రి శిక్షణలో అల్లారుముద్దుగా పెరిగిన అతడు యెలా ఉత్తముడు కాకుండా ఉంటాడు? నీటి పారుదల శాఖలో ఉద్యోగం ఆరంభించిన హరసూదయాల్ తన నిజాయితీ దీక్షలవల్ల జిల్లా అధికారి, రెవెన్యూ ఆఫీసర్ పదవులు చేపట్టాడు, 'పేరు-.డబ్బు పుష్కలంగా సంపాదించాడు. అయినా గర్వం 'లేదు. దయ సౌజన్యం ఆయన సొత్తు, మాట-మనసు మెత్తన. అన్ని విధాలా ఆయనకు తగిన ఇల్లాలు పూలరాణి. ఆ పుణ్యదంపతుల నోముల పంట మన ముద్దు మూగ ముసలయ్య, జైప్రకాశ్ నారాయణ్!
ఉన్నత విద్య
దియారాలో ఆకాలంలో ఒక మాధ్యమిక పాఠశాల మాత్రమే ఉండేది. తండ్రి ఉద్యోగ కారణంగా వూళ్ళు తిరుగుతూ ఉన్నందున జయ్యప్రకాళ్ చదువు స్థిరంగా సాగలేదు. ఎలాగోలాగు ప్రాథమిక విద్య పూర్తయింది.
తర్వాత ఉన్నత విద్య కోసం పాట్నా పంపించారు. బంధువుల యింట భోజన భాజన వసతి సమకూర్చారు. కలిగిన వాళ్ళకు చుట్టాల కలుపుగోలు తనానికి సహకారానికి కొదవేముంటుంది. అబ్బాయి చదువులో (శద్ధగా లీనమయ్యాడు,
ఆ కాలంలో పాట్నా నగరం ఇప్పటివలె విశాలమైన తారు రోడ్లతో పెద్ద పెద్ద భవనాలతో అధునాతనంగా లేదు, మామూలు కంకర రోడ్లపై గుర్రపు జగ్గీలు గర గర శబ్దం చేస్తూ పోతుం డేవి.
పాట్నా కాళేజెట్ స్కూల్లో ఏడవతరగతిలో ప్రకాశకు ప్రవేశం లభించింది. ఆ విద్యాలయ 'అధ్యక్షుడు అంజాద్ ఆలీఖాన్ సభ్యుడు, సంస్కార సంపన్నుడు. ఆయన పర్యవేక్షణలో జయప్రకాశ్ చదువు చక్కగా సాగింది. విద్యార్థనలోనే లీనమై [క్రమంగా మేధావిగా రూపొందసాగాడు. ఇతర విషయాల పైకి అతని ధ్యాస 'వేళ్ళేదికాదు.
తర్వాత అతని మకాం 'సరస్వతీభవన్” హాస్టల్కి మారింది. అక్కడే ఎందరో రాజనీతిజ్ఞులు శిక్షణ పోందారు. ఉత్సాహవంతులు మేధావులు అయిన విద్యార్థులకు.అది నిలయం. బీహార్ కేసరివాబూ రోజూ అక్కడికి వస్తుండేవాడు. అనేక రాజకీయ విషయాల చర్చలు సాగేవి. గఫ్చుప్గా ఆ వాదనలన్నీ వింటుండే వాడు జయప్రకాశ్ . అప్పుడు తాను వాచాలత్వం చూపకున్నా క్రమంగా ఆయన మనస్సు మాత్రం దేశభక్తితో నిండిపోసాగింది.
ఆయన అభిరుచి మారింది. కేవలం పుస్తకాల పఠనతో నే సంతృప్తే చెందక వార్తాపత్రికలు చదివి దేశ రాజకీయ సామాజిక విషయాలు గ్రహించడంలో నిమగ్న మయ్యేవాడు.
పాఠశాల గ్రంథాలయంనుండి మంచి పుస్తకాలు తీసుకొని చదివేవాడు. క్రమంగా జయప్రకాశ్ మేధస్సుతోపాటు వ్యక్తిత్వం కూడా పెంపోంద సాగింది, అప్పుడతని వయస్సు కేవలం పదహారు.
సోదరి వివాహం - బావతో స్నేహం
జయ్యపకాశ్ సరస్వతీ భవన్లో వుండి విద్యాభ్యాసం చేస్తున్న కాలం లోనే ఆయన పెద్దక్క చందావతి వివాహం అయింది. వరుడు వణ బీహారీబాబు పాట్నా హైకోర్టు ఆఫీసు ఉద్యోగి. ఆయన శాంత స్వభావం కల సద్గుణవంతుడు.
నియమ నిష్టా సంపన్నుడు. జయప్రకాశ్ హాస్టల్ వదలి అక్కగారింటిలో వుండ సాగాడు. బావగారి పర్యవేక్షణలో ఆయన శీలం మరీ సంస్కారవంత మైనది. యద్యదాచరతి శ్రేష్టఃతత్త దేవేతరో జన:, అన్నట్లు పెద్దల ప్రభావం పిన్నవారిపై తప్పక ప్రసరిస్తుంది.
వ్రజ బిహారీ ఇల్లు బడికి చాలదూరం. పగలు భోజనానికి వచ్చే వీలుండేది కాదు. రోజుకు మూడణాలు జయప్రకాశ్ ఖర్చుకోసం లభించేవి - ఇంట్లో ఇచ్చే వారు. ఒక రూపాయికి పదహారు అణాలు, అణాకు ఆరు పైసలు. అప్పటి లెక్క అది. రెండణాలు పోను రానూ జట్కా ఖర్చు. మిగిలిన అణాలో టిఫీన్ కాఫీ హోటల్లో తీసుకునేవాడు. ఇప్పుడు డబ్బు విలువ తరిగి వస్తువు విలువ పెరిగింది. వస్తువుల ఉత్పత్తి తరిగి, వాడకం పెరిగినప్పుడు ఇలాంటి మార్పులు తప్పవు మరి
ఇంట్లో అక్కయ్య లేని సందర్భంలో బావ వంట చేసే సందర్భాల్లో ఆయ నకు సహకరిస్తూ క్రమంగా జయ[ప్రకాశ్ కు పంటచేయడం వచ్చింది. అది భావి జీవితంలో ఎంతగానో వుపయోగపడింది. అది స్త్రీలు చేసే పని, పురుషులు వంట చేయడం తప్పు_అని భావించడం పోరపాటు!
గీతా భక్తుడయ్యాడు
భారతీయ జన జీవితంలో వేదధర్మం (హిందూ మతం) గంగా జీవనది లాంటిది. చార్వాక, జైన, బౌద్ధ, ఇస్లామి, కై స్తవం, ఇలా ఎన్ని స్వదేశ, విదేశ మతాలు వచ్చినా అది ఎన్నో మార్పులకు లోనవుతూ అవిచ్చిన్నంగా ముందుకు సాగిపోతూనే వుంది.
పౌరాణిక మతాల్లో శైవం, వైష్ణవం (ప్రముఖమైనవి, ఆత్మవాదం ఉపనిషత్తు లలోనిది. ఆధ్యాత్మికం (ఆత్మ గొప్పదనే భావం) విద్యావంతుల్లోనే వ్యాప్తి. అయినా జనసామాన్యం చిల్లర దేవతలతో పాటు పౌరాణిక 'దేవతలనూ గౌరవించే వారు. (బ్రాహ్మలు, ధన సంపన్నులు వేద ధర్మాలను, యజ్ఞయాగాలను అభిమా నించేవారు.
మహాభారత యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునునకు బోధించినట్లుగా వ్యాసుడు వ్రాసిన భగవద్గీత పఠన ఆరాధన హిందువులలో అధికం, అది వైదిక ఉపనిషత్తుల ధర్మాలకు పట్టం కట్టింది, ఒక పవిత్ర గ్రంథంగా పేరుపొందింది.
రాహుల్ సాంకృత్యాయన్ అభిప్రాయం ప్రకారం.గీత కొత్త సీసాలో పాత సారాయి లాంటిది! అయినా అందులో యెన్నో మంచి నీతులున్నాయి. ముఖ్యంగా మన భారం భగవంతునిపై వేసి ఆశారహితంగా పనులు చేయమని ప్రబోధిస్తుంది భగవద్గీత,
కర్మణ్యేవాధి కారస్తే మా పళేశు కదాచన, (ఫలితాలను కోరకుండా పనులు చేయటమే నీ వంతు)
శంకరాచార్య రామానుజులు వంటి యతులేకాక, తిలక్, గాంథీజీ వంటి రాజకీయ నాయకులు కూడా గీతకు నచ్చిన తమకు వ్యాఖ్యానాలు (వ్రాసారు.
బావగారి సంస్కారమనండి, మరే ఇతర కారణంవల్ల కానీండి, జయ ప్రకాశకు గీతాభ క్తి కుదిరింది. ఉదయమే లేచి స్నానం చేసి గీతను పఠించడం ఆయనకు నిత్యకృత్యం అయింది.
తన పుస్తకాలతోపాటు గీతా పుస్తకం సైతం బడికి తీసుకెళ్ళేవాడు. మధ్యాహ్నం విరామ సమయంలో ఒకటి రెండు శ్లోకాలు మిత్రులకు చదివి విని పించేవాడు.భావం విపరించేవాడు.
శాంతి-కాంతి మధ్య
అప్పుడు మనదేశంలో స్వరాజ్యం సాధనకోసం శాంతి.క్రాంతి రెండు గాలులు తీీవ్రంగా వీస్తున్నవి, పాట్నాలోనూ అంతే.
కలకత్తానుంచి గంగా జలమార్గాలున్న ప్రధాన నగరం పాట్నా, బెంగాల్ తీవ్రవాద ప్రభావం పాట్నాపై కూడా ప్రసరించసాగింది. 1909 అరవింద ఘోషు అలీపూరు క్యుటకేసు, 1915లోని జతీం[దనాథ్ విప్లవ కార్యక్రమాలు, మొత్తం. 'దేశన్నే సంచలన పరచినవి. యువకులు ఆయుధ చర్య ద్వారానే సత్వర స్వరాజ్య సాధన లక్ష్యంగా పెట్టుకున్నారు. “బ్రిటిష్ వాళ్ళను కాల్చివేసి బస్తాల్లో నింపండి” అని జెనీవానుంచి మేడం కామా 'పందేమాతరం” పత్రికలలో చేసిన హెచ్చరిక వారికి ఆదర్శమయింది. దానికి బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు సంసిద్ధపడినవి. బీహార్ ఎలా ఊర్కుంటుంది. పాట్నాలోనూ విప్లవకారుల రహస్య సంఘం ఒకటి పని చేయసాగింది.
దేశంలో మొట్టమొదటి బాంబు పేలుడు, మొదటి దోపిడి రాజకీయ పరంగా బీహారులోనే జరిగాయి. _ఖుదీరాం బోసు ముజఫర్పూర్లో గుర్రపు ఐండి పై బాంబువేసి I.A.S కింక్స్ఫర్డ్ ఇంటి ముందు ఇద్దరు ఆంగ్ల స్త్రీలను చంపాడు.అలహాబాద్లో అర్జున్లాల్ సేథీ దొంగతనం చేశాడు.
యువతరం విప్లవోోద్రేకంతో ఊగిపోతోంది.
మరోవైపు గోఖలే గాంధీజీల కాంగ్రేసు శాంతి సత్యాగ్రహ ప్రచారం. ఈ "రెండు భావాల ప్రభావాలు జయప్రకాష్ పై తీవంగానే పడినై, కాంతి(క్రాంతి రెంటిలో తన మార్గం ఎటు అనేది త్వరగా తేల్చుకో లేకపోయాడు.
ఆ కాలంలోనే గాంధీజీ చంపారణ్లో అహింసా పోరాటాన్ని గూర్చి ప్రచారం చేసి వెళ్ళాడు. ఆ ప్రసంగం జయ్యపకాశ్ విన్నాడు. గాంధీ మాట ప్రభావం అతనిపై బాగా పడింది. నాజూకైన తెల్లని దుస్తులు, మెరిసే పాదరక్షలు వదలివేసి, మోకాళ్ళవరకు ముతకధోతీ, మందపు చొక్కా, తోలు చెప్పులు ధరించ సాగాడు జయపకాశ్ , గోఖలే వ్యక్తిత్వానికి, గాంధీ నిరాడంబరతకు ముగ్ధ్యుడై, వారి అభిమానిగా మారిపోయాడు.
కళ్యాణమయ్యింది
అన్ని విధాలా తగిన జోడీలు కుదరవు. అలా తగిన జంట ఏర్పడినా ఎక్కువకాలం బతకరు అని లోకంలో సాధారణంగా అంటారు. కాని అది తప్పని ప్రభావతీ జయప్రకాశ్ లు నిరూపించారు.
బీహారు కాంగ్రెసు నాయకుల్లో (ప్రముఖ వ్యక్తి బాబూ వజ్రకిషోర్. ఆయన కూతురుతో జయపకాశ్ వివాహం జరిగింది.
ఒకనాడు జయప్రకాష్ తమ పినతం[డ్రి. శంభూబాబుతో కల్సి జాతీయ నాయకుడైన డా॥ రాజేందప్రసాద్ శిబిరానికి వెళ్ళాడు. అక్కడే వజ్ర కిశోర్' బాబు జయపకాశ్ ” రూపాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆదర్శన్ని చూసి ముగ్ధుడై అల్లునిగా చేసుకోవాలనుకున్నాడు
ప్రభావతి అతని ముద్దుల కూతురు. కొడుకులతో పాటు మగపిల్లవాడు వలెనే ఆమెను గారాబంగా పెంచాడు. జాలంధర్ కన్యా విద్యాలయంలో చదువు తున్నది. అంతా పదునాలుగేండ్ల (ప్రాయం, అష్టవర్షాత్ భవేత్కన్యాఅని యుక్త వయస్సు రాకముందే కూతుళ్ళకు పెళ్ళిళ్ళుచేసే కాలమది. పురాణాల్లో యువతులకు కళ్యాణాలు జరిగినట్లు సాక్ష్యమున్నా, ఇతిహాస కాలపు సీతారాముల వివాహ సందర్బంలో రాముని వయస్సు పదునాలుగు, సీతకు ఏడేండ్లట, భారతంలో సత్య వతి, కుంతి, హిడింబి, ద్రౌపది, సుభ్యద్ర, ఉత్తర, శశిశేఖలవి యువ వివాహాళే !
పూలరాజి, హరసూదయాల్ ఆ వా ర్తవిని ఆనందంతో తల మునక లయ్యారు. అంత గొప్పవ్య క్తి కూతురు, సుగుణాల.సౌొందర్యాల రాశి తమకు కోడలుగా వస్తుందని ఆ సంతోషం, ఎంత డబ్బు ఇస్తున్నారనేది ఈనాటి ఆచార మయింది. డబ్బు కాదు కుటుంబ గౌరవం ముఖ్యం అనుకునేవారు నాడు.
వైభవంగా కల్యాణం జరిగింది. నవవధువు ప్రభావతితో పాటు వరుడు జయ(ప్రకాశ్ శ్రీనగర్నుంచి బంధు మిత్రులతో పాటు దియారాకు వచ్చాడు. వధువు సుందర రూపం సుగుణ సంపదకు అత్తింటి బంధువులు ముగ్ధులైనారు. కోడలిని గృహలక్క్మిగా భావించారు వరునింటివాళ్ళు.
వజ్ర కిషోర్ 1921-32లో బీహార్ కాం[గైసులో ఘనంగా పని చేశాడు. గాంధీని మొదటిసారిగా చంపారణ్కు ప్రసంగానికి ఆహ్వానించింది అతడే, ఆయన శిష్యరికంలో ఎదిగిన వ్యక్తి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, ఇక సౌంత అల్లుడు జయప్రకాశ్ ఆయనవల్ల స్పూర్తి పొందడంలో అసంగత మేముంటుంది.
అదే సందర్భంలో కలకత్తానుంచి పాట్నాకు నివాసం మార్చి రాజేంద్ర ప్రసాద్ హైకోర్టు లాయర్గా రాణించ సాగాడు. రాజకీయాలు వదలుకో లేదు. ఆయన ప్రభావం జయప్రకాష్ పై చక్కగా ప్రసరించింది.
పైగా డా॥ రాజేంద్ర బాబు పెద్దకొడుకు మృత్యుంజయ ప్రసాద్కు ప్రభావతి చెళ్లలుతో పెళ్ళయింది. ఈ బంధుత్వం వారిని మరింత దగ్గర చేసింది.
తండి [ప్రభావంవల్ల రాజకీయాల ఆస క్తి "సేవా పరాయణ కల ప్రభావతి, భ_ర్త సౌజన్యం, సాదాజీవితం , ఉన్నత వ్యక్తిత్వం, 'దేశభ క్తిచూసి ఆనందించింది. తానూ పతి అడుగుజాడల్లో నడవసాగింది.
అందుకే వారు ఆదర్శ దంపతులు కాగలిగారు.
వివా హ్ో విద్యనాశాయ.అనే సూక్తికూడా ఆయనపట్ల అసత్యమే అయింది.
విద్యార్ధనకు - విదేశాల ప్రయాణం
గాంధీజీ 1921 సత్యాగ్రహంలో ప్రవేశించిన వెంటనే, జయప్రకాశ్ సబర్మతీ ఆశ్రమానికి వెళ్ళడానికి పయనమయ్యాడు. మామకు అది ఇష్టంలేక అడ్డు చెప్పటంతో ఆగిపోయాడు. రాజకీయాలు తనకెంత ఆసక్తిగా ఉన్నా నవ యువకుడు సంసారాన్ని వదలి బైరాగిగా వెళ్ళి సత్యాగ్రహ ఉద్యమంలో చేరి పోవడం వజ్ర కిషోర్బాబుకు నచ్చలేదు. అది గొప్ప విషయమే అయినా కూతురు విషయం తన ఆదర్మానికి అడ్డు నిలిచింది.
డా॥ రాజేంద్రపసాద్ ప్రధాన ఆచార్యకత్వంలో నడుస్తున్న బీహారి విద్యాపీఠంలో జయ్యప్రకాశ్ ఇంటర్ మీడియెట్ విజ్ఞానశాస్రంలో ఉన్నత శ్రేణిలో ఉ త్తీర్ణుడయ్యాడు, బి. ఎస్సీ, చదువుకోసం వారణాసి వెళ్ళాడు. పాట్నాలో లేదు.
ప్రొఫెసర్ పూల్ దేవ్ సాహెబుతో కల్సి ఉంటూ చదువుతోపాటు సైన్సు పరిశోధనా రంగంలో పాల్గొనేవాడు.
సహాయ నిరాకరణ సందర్భంలో గాంధీజీ పిలుపువల్ల దేశంలోని అనేక విద్యార్థులవలె తానూ కాలేజీ వదిలాడు. ఉద్యమం నిలిచిపోయినతర్వాత 1922లో హిందూ కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేయమని గురువులు ప్రోత్సహించారు. కాని అతనికది రుచించలేదు. నిన్న మొన్నటివరకు ఆంగ్ల ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ తిరిగి, మళ్లీ ఆ ప్రభుత్వ సహాయంతో నడుపబడుతున్న ఏ విద్యాసంస్థలోనై నా చదవటం భావ్యంగా కనిపించలేదు. తమ అనుకూలతనుబట్టి సిద్ధాంతాలను మార్పు కునేందుకు సుముఖంగా లేడు జయ్యప్రకాశ్ ,
అంతకుముందు బీహార్లో స్వామీ సత్యదెవ్ మాటల (ప్రభావం వల్ల అతనికి అమెరికాపై ఆసక్తి ఏర్పడింది. అక్కడికే 'వెళ్ళి చదువుకోవాలనే నిర్ణయా నికి వచ్చాడు.
అదే సందర్భంలో గద్ద్ వాలి విద్యార్థి బోలాదత్తు హిందూ విశ్వ విద్యా లయంలో చదువుకునేవాడు అమెరికా వెళ్ళి విద్యాధ్యయనం కావించాలనుకున్నాడు, సహాయం కోసం ఒకనాడు అతడు వజ్రకిశోరీలాల్ ఇంటికి వచ్చాడు. మామగారి కంటే ముందు అల్లునితోనే పరిచయం కలిగి, మాటలు కలిసి ఇద్రరు మి(తులై నారు. ఇద్దరి కోరికలు ఒకటే కాబట్టి దోస్తి "పెరిగింది. ఆయన అశించిన ప్రకారం సహాయం లభించి అమెరికా వెళ్ళి మిత్రునికి లేఖ వ్రాసాడు.
“మీరు మీకిష్టమైనప్పుడు రావచ్చును, అమెరికాలో విద్యార్థనకు అను కూలంగా వుంటుంది. ఎలాంటి ఇబ్బందీ కలగదు.”
ఆ మాటలు జయప్రకాశ్ ఉత్సాహాన్ని పెంచినై .
రహస్యంగా ఆ ఉత్తరాన్ని భార్యకు చూపాడు, కలకత్తా వెళ్ళి పాస్ పోర్టు తీసుకొని వచ్చాడు. వేళ్ళే తేదీని (ప్రభావతికి మాతం తెలిపాడు. అప్పుడతని వయస్సు 20. ప్రభావతి పయస్సు 16 సంవత్సరాలు,
“మీకు అక్కడే చదువుకోవాలని వుంటే మీ కోరికకు నేను అడ్డురాను” అంది ఆమె భర్తతో.
“నేను త్వరలోనే తిరిగివస్తాను భయపడకు, నువ్వు కూడ ఇక్కడ అంత వరకు చదువుకో. రాట్నం వడుకు, ప్రతిరోజు గీతా పఠనం కావించు” ఇదీ ' జవ్వని అయిన భార్యకు యువకుడు జయప్రకాశ్ ఇచ్చిన ఆదేశం,
ఆయనటు అమెరికాకు ప్రయాణం కాగానే ప్రభావతి ఇటు. గాంధీజీ సబర్మతీ ఆశ్రమానికి వెళ్ళిపోయింది.
జపాన్ నచ్చింది
16 మే 1922న కలకత్తా హార్బర్నుంచి జెనస్ నౌకలో విదేశాలకు బయల్దేరాడు జయృపకాశ్ , తొలిసారిగా సముద్రప్రయాణం ఎంతో ఆనందదాయ కంగా వుంది. మలయా, పినాంగ్, సింగపూర్ మీదుగా చీనాలోని హాంకాంగ్ చేరాడు అక్కడ జపాన్లోని కోభే రేవుకు చేర్చింది నౌక,
జపాన్ జయప్రకాశ్ కు బాగా నచ్చింది.
చిన్న చిన్న పరిశుభ్రమయిన గృహాలు, వాకిళ్ళలో పూలమొక్కలు, మిత అలంకారాలతో సుందరంగా కనిపించే రమణులు, ఉత్సాహవంతులయిన నవ యువకులు అతని మనస్సును ఆకట్టుకున్నారు.
జపాన్ 'చేశం చిన్నదయినా, విశాలమయిన రష్యానే ఓడించి (ప్రమాద కారులయిన ఐరోపా శ్వేతజాతీయులను సిగ్గుపడజేసింది. ప్రభాత సూర్యవందన ముతో ప్రతిదినం తమ కార్యక్రమాలను ఆరంభించే జపానీయులు కేవలం మేబది. సంవత్సరాల్లోనే యెంతగానో ఎదిగి ఉద్యోగ, వ్యాపారాల్లో (ప్రపంచ ఖ్యాతి. నార్జించారు.
ఆ దేశంవలే భారతచేశాన్ని సుందరంగా స్వచ్చంగా, స్వేచ్చగా వుంచుకోగలిగేది యెప్పుడో అనుకున్నాడు.
కోబేనుండి ఒసాకా వెళ్ళాడు. అక్కడ మహచేవ్లాల్ శర్యాఫ్ కలిశాడు" ఆయన కూడా పైచదువుల కోసం అమెరికా వెళుతూ డబ్బు సరిపోత కోబేలో జపానీ పత్రికల ప్రూఫులు దిద్దుతూ గడుపుతున్నాడు.
ఒకాసానుంచి జయప్రకాళ్ ట్రైన్లో యోకోహోమా వెళ్ళాడు. అక్కడి నుంచే “తై యో మారూ ” అమెరికా (ప్రయాణం సాగించాడు. సుందర మయిన జపాన్లో వారంరోజులు గడిపాడు. అది అతనికి అందమయిన అనుభవం మరపురాని మధుర స్మృతి!
అమెరికాలో
విశాల పసిఫిక్ మహాసమ్యువ్రంలో పయనిస్తూ అమెరికా చేరువ అపుతున్న కొలదీ యెంతగానో ఆనందించాడు.
మార్గంలో హవాయి ద్వీపంలో నౌక ఆగింది. అక్కడి ఎమోనాకీ పర్వతం హిమాలయాలకంటే ఉన్నతమైనదయినా అడుగు భాగం సముద్రజలములో మునిగి వుండటంచేత ఎవరిస్టు రికార్డును మించలేదట, ఆ సుందర ప్రకృతి మధ్య ఒక దినం గడిపాడు. పద్దెనిమిదో రోజున సన్ ఫాన్సిస్కో చేరాడు.
టాక్సీ ద్వారా ఒక హబ్సి హోటల్కు వెళ్ళాడు. అక్కడి పేదరిరపు వాతావరణం |ప్రకాశ్ మనస్సును "కలచివేసింది.
అక్కడినుండి ఇతర భారతీయ విద్యార్థులున్న “నలందా క్లబ్”కు నివాసం మార్చి భారతదేశంలో వున్నంత సంతృప్తిని పొందాడు. అక్కడ "కే. బి . మీనన్ తోడుగా వున్నాడు. క్యాలిపోర్నియా యూనివర్సిటీలో చేరాడు.
సముద్రం ప్రక్కన సువిశాల స్థలంలో గొప్పమేడల్లో ఆ విశ్వవిద్యాలయం వుంది. అక్కడి ఆచార్యులు బాగా చదివినవాళ్ళు, బోధనలో నేర్పరులు. ఆ వాతా వరణం అతనికి నచ్చింది. కాని అక్కడి ఫీజు మాత్రం భారంగా వుంది. ధనవంతు లకు బాధలేదుకాని జయ్యప్రకాశ్ కు దాన్ని భరించడం కష్టమే, ఒక టర్మ్ కాలం చదివాడక్కడ.
భోలానందదత్తు చదువుకుంటున్న ఇయోవా యూనివర్శిటీలో చేరాడు. ఆ తర్వాత, అక్కడ ఫీజులు తక్కువ. డా॥సుధీంద్ర బోస్ అక్కడే (పౌఫెసర్, చదువుకోసం కూలీపని చేశాడు
శ్రద్ధగా చదువుసాగుతున్నది కాని, డబ్బు అవసరం యెక్కువే , తం(డ్రి ఇచ్చిన డబ్బు అయిపోయింది. మళ్ళీ ఆయనకు వ్రాయాలనిపించలేదు. ఆయన ఆర్థిక పరిస్థితి అంతమా,త్రంగానే వుంది. ఇంకా పిల్ల లున్నారు. అభిమానం అడ్డు వచ్చి మామను సైతం ఏమీ అడగలేదు.
చదువుపై వున్న ఆసక్తి తిరిగి తన దేశానికి వెళ్ళనీయలేదు. డబ్బు కావాలి. తానే సంపాదించుకోవాలి, అందుకు శారీరక శ్రమే శరణ్యమయింది. విరామ సమయాల్లో కూలీపనికి పూనుకున్నాడు.
ద్రాక్ష తోటల్లో పనిచేశాడు, ధనవంతుల ఇండ్లలో సామానులు, పుస్తకాలు దులిపి సర్ధి పెట్టె వాడు. వాకిళ్ళలో "పేరుకుపోయిన మంచుగడ్డలను పెకిలించి దూరం పారవేసేవాడు, హోటళ్ళలో పనిచేశాడు. చివరికి పశువులుకోసి, చర్మాలు ఒలిచి
మాంసాన్ని ముక్కలుచేసి ప్యాక్ చేసి దేశవిదేశాల్లో అమ్మే కసాయి శాలల్లోనూ పనిచేశాడు. మాంసం తినని కాయస్థ (బ్రాహ్మణ కుటుంబపు జయప్రకాశది ఎంతటి దుర్భర విషయమో గ్రహించవచ్చు. అయినా సహించాడు. అతని విద్యా తృష్ట అంతటి బలీయమైనది.
కాలిఫోర్నియా వదలి వెళ్ళేముందు. ఒకరోజు సిక్కులవద్ద కూలిపని చేసాడు ఛార్జీ డబ్బుకోసం. తర్వాత పండ్ల ప్యాకింగ్ కంపెనీలో పనిచేసి
ఇయోవా వెళ్ళాడు. అక్కడి భారతీయ విద్యార్థులతో కల్చివుంటూ భోలానంద్తో కల్సి వంట చేసుకునేవాడు. ఇయోరాలోనే మిగతా పనులన్నీ చేసింది.
అక్కడ ఏడాది గడిచింది. కెమికల్ ఇంజనీరింగ్ చదివాడు. అయితే డ్రాయింగులో తప్పాడు. ఆ తర్వాత షికాగో వెళ్ళాడు. ఇది అమెరికాలో రెండవ పెద్ద నగరం ఆ కాలంలోనే దీని జనాభా 335 లక్షలు, ఇక్కడే ప్రపంచ సర్వమత మహాసభలో వివేకానందుడు ప్రసంగించి ప్రపంచ ఖ్యాతిని పొందాడు.
ఇక్కడ తీపి, చేదు అనుభవాలు బాగా కలిగాయి. డబ్బుకోసం యెక్కువ శ్రమించవల్సి వచ్చిందీ ఇక్క డే. మాంసం ఫ్యాక్టరీలో, మట్టిపాత్రల బొమ్మల కంపెనీలో పనిచేశాడిక్కడ, లోహ పరిశ్రమలో నూ పరిశ్రమించాడు. అన్నీ తాత్కా లికపువే-పర్మనెంట్ ఉద్యోగాలు కావు, తనకు చదుపుసాగడం కోసం కదా ఆ పనులన్నీ. నో వేకెన్సీ బోర్డులు చూస్తా కాళ్ళరిగేలా తిరిగేవాడు ఒక్కోసారి. ఎందుకొచ్చిన కష్టం, ఏదో నౌకరి చూసుకొని హాయిగా ఇంట్లో పుండక. ఆయన విజ్ఞాన తృష్ట అలా నిలువనీయలేదు.
ఏటికి ఎదురీదడమే ధీర గుణం.
అన్నీటికి వెత చెందడమే పిరికితనం.
కొన్ని బియ్యం ఉడికించుకుని తిని బజారులో కాఫీ తాగి, భోజనం అయిం దనిపించుకునేవాడు. ఇంత (శ్రమ వున్నా విరామం దొరికినప్పుడు రాకేట్ తీసుకొని లింకన్ పార్క్కు వేళ్ళి "టేన్నిస్ ఆడీవచ్చేవాడు. దానికీ ఫీజు లేదు. ఆధునిక నగరాల్లో ప్రతీదీ డబ్బుతో కొనబడుతుంది కదా.
ఇన్ని చేసినా చదువుమీద అశ్రద్ధమా(త్రం చూపలేదు.
మరో యూనివర్సిటికి మారాడు
క్యాలిఫోర్నియా, ఇయోవా, షికాగోల తర్వాత విక్సొౌంసిన్ విశ్వ విద్యా లయానికి వెళ్ళాడు. ఆ రాష్ట్రం అమెరికాలో (ప్రగతిశీల మైందిగా చెప్పబడేది. ఆ విద్యాసంస్థకుకూడా మంచి పేరుంది. అక్కడ (గ్రాడ్యుయేషన్ పూర్తికాకముందే విజ్ఞానశాస్త్రం నుంచి సామాజిక శాస్త్రానికి మారాడు. అక్కడినుంచి షికాగో వెళ్ళి రష్యావెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతలో ఇండియా నుంచి డా॥ రాజేంద్రా ప్రసాద్గారి లేఖ వచ్చింది. దాని సారాంశం ఇది.
“మీరు అటునుంచే రష్యా వెళ్ళకండి. భారతదేశం రండి. ఒక'వేళ మీకు రష్యా వెళ్ళాలని అంత ఇష్టంగాఉంటే ఇక్కడినుంచే అటు వెళ్ళే ఏర్పాటు చేయ బడుతుంది.”
జయప్రకాశ్ లేఖకిది జవాబు అయి ఉంటుంది. ఆ కోరిక అతని మామ గారిది అయివుంటుంది.
రష్యా (ప్రయాణం వాయిదా వేసుకుని విస్కౌంసిన్కు వెళ్ళి అక్కడి యూనివర్శిటీలో సామాజిక శాస్త్ర పఠనం ఆరంభించాడు. ఒక టర్మ్ గడిచే సరికి లైండిఓహ్యా విశ్వవిద్యాలయంలో సిటు దొరికింది, అక్కడ బి .ఎ. పూర్తి చేశాడు. డిస్టింక్షన్లో ప్యాసయినందున 30 డాలర్ల మాసవేతనంకూడా లభించింది. ఇక కూలీ పనికి సలాంకొట్టి లభించే డబ్బునే పొదుపుగా వాడుకోసాగాడు.
ఎం. ఎ.లో చేరిన కొన్ని మాసాలకే అతని యోగ్యత, సచ్చిలత గమనించి అదే యీనివర్శిటీలో అసిసైంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారు అధికారులు. ఎం. ఎ. చదుపుతూనే క్రింది తరగతులకు విద్యాబోధన కావించేవాడు. అందుకు అదనంగా 80 డాలర్లు లభించి, డబ్బు సమస్య తీరిపోయింది.
ఇక పూర్తి సమయాన్ని చదువుమీద కేం[ద్రీకరించాడు. ఆయనకు ఏ ఒక్క. విషయంతోనో సంతృ ప్తి-స్థిరత లేదు. కొ త్తకొ త్ర విషయాలపై ఆసక్తి పెరిగి తరచు చదువు మార్చుతుం డేవాడు.
ఎం.ఎ.లో సోష్యల్ వేరియేషన్ అభిమాన విషయంగా తీసుకున్నాడు, [హై ప్రొఫెసర్ లుమ్గే గైడ్, ఆయన ధీసిస్ సర్వోత్తమమైందిగా ప్రశంస పోందింది. ఆ తర్వాతపి. హెచ్. డి.కి పూనుకున్నాడు. ఇంక ఒక సంవత్సరమైతే పూర్తి అపుతుందననగా తల్లి పూలరాణి అనారోగ్యంగా ఉన్నట్లు తిరిగి రావలసిందిగా లేఖ వచ్చింది. డిగ్రీ పూర్తికాందే వేళ్ళాలని లేదు. కాని అమ్మ వైపు మనసు లాగుతుంది. కన్నతల్లి!
ఈ ప్రయాణం సంగతి ముందుగా ఊహించింది కాదు కనుక చదువు, పుస్తకాలు, భోజన వసతి కోసం ఆదాయాన్నంతా వ్యయం చేసాడు. డబ్బుకి సమస్యగానే వుంది.
డబ్బు పంపండి వస్తానని ఇంటికి రాయడానికి మనసొప్పలేదు. న్యూ యార్కు చేరి తన రెడ్డి మిత్రునితోపాటు హోటళ్ళలో, ఫ్యాక్టరీలలో పని చేయ సాగాడు. అమ్మ జ్ఞాపకం అతనికి అలసట బాపి నూతనోత్సాహాన్ని ఇచ్చేది, ఖర్చులకు సరిపడినంత డబ్బు సమకూరగానే ఇండియాకు ప్రయాణమైనాడు.
డా॥ రాధాకృష్ణన్ను కలిశాడు లండన్ లొ
1929 సెప్టెంబర్లో నౌక అమెరికాను వదిలింది. ఇంగ్లాండులో 28 రోజులు ఆగాడు. ప్రముఖ భారతీయ వేదాంత విద్వాంసుడు డా॥ సర్వేపల్లి రాధా కృష్టన్ అప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హై ప్రొఫెసర్. ఆ విద్వాంసుని దర్శించి అమితానందం పోందాడు జయప్రకాష్ .
ఇంగ్లాండునుండి ఆస్ట్రే లియా నౌకలో కొలంబో (శ్రీలంక) చేరి అక్కడినుంచి మరో నౌకలో కలకత్తా చేరాడు. జన్మభూమిని వదలి సరిగా యేడేండ్ల యింది.
ఆసక్తిగా అత్తవారింటికి వెళ్ళాడు. (ప్రభావతి పాట్నాలో లేదు, గుజరాత్ లోని గాంధి ఆశ్రమంలో ఉంటున్నట్లు తెల్సింది,
అక్కడినుంచి చక్కగా దియారాకు వచ్చాడు. ఏడేండ్లుగా తసయుని రాక కోసం ఎదురుచూస్తున్న తల్లి ఒడిలో ఒదిగిపోయాడు. కన్నీటితో కొడుకును గాఢంగా కౌగిలించుకుందామె.
జననీ జన్మ భూమిశ్చ సర్గాదపీ గరీయసీ.
రాజకీయ వాతావరణం
1906 16లో హోంరూల్ ఉద్యమ నిర్వాహకుడు, “కేసరి” మరాఠా పత్రికాధిపతి, ప్రముఖ అతివాద కాంగ్రెసు నాయకుడు బాలగంగాధర తిలక్ 1920లో మరణించాడు.
1921లో గాంధీజి సహాయ నిరాకరణ స్వాతంతోద్యమం ఉప్పెనగా లేచి చల్లారింది.
1928 సైమన్ కమీషన్వ్యతిరేకత దేశంలో తీవ్రస్తాయి చేరింది. “పంజాబ్ కేసరి” లాలాలజపతిరాయ్ అడే సందర్భంలో లాహోర్ ప్రదర్శనలో లాఠీ 'దేబ్బలు తిని మరణించాడు.
మద్రాసులో సైమన్ కమిషన్ గుండె ధైర్యంతో ఎదిరించి టంగుటూరి ప్రకాశం పంతులు “ఆంద్రాకేసరి” బిరుదు పొందాడు.
1929 ఏపిల్ 8న భగత్సింగ్-బటుకేశ్వర దత్తులు ఆజాద్ చంద్ర శేఖర్ పర్యవేక్షణలో ఢిల్లీ అసెంబ్లీ'లో బాంబు వేసి అరెస్ట్రయినారు.
కాంగ్రేసు సమాలోచనలు సాగుతూనే ఉన్నవి. అటువంటి పరిస్థితిలో భారతచేశానికి చేరిన జయ్యప్రకాశకు బంధుమి(త్రుల్లో, గురుజనంలో స్వాగత సత్కా రాళే లభించాయి.
ముగేర్లో బీహార్ [ప్రాంతీయ రాజకీయ సమ్మేళనం జరిగింది. సభాద్యక్షుడు డా॥ రాజేంద్రప్రసాద్, ముఖ్య అతిధిగా బార్డోలీ సత్యాగ్రహనేన వల్లభభాయి పటేల్, స్వామీ సహజానంద సరస్వతీ వచ్చారు. పేరుగల ఆ నాయకులు సంపూర్ణ స్వరాజ్యాన్ని కాక పాక్షిక స్వాతంత్రంనే కోరినారు. నవయువకులు దానికి అంగీ కరించలేదు. వారికి విప్లవ పంధా- సంపూర్ణ స్వరాజ్యం కావాలని వుంది.
తర్కవితర్కాల అనంతరం ఓటింగ్లో యువకులకే విజయం లభించింది. దానికి జయ్యప్రకాశ్ మనస్సు చాల ఆనందించింది. వృద్ధ నాయకత్వం నత్త నడక ఆయనకు నచ్చేవి కావు. ఈ సమావేశంలో ఆయన కేవలం సాక్షిగానే ఉన్నా, రాజకీయాల్లో పాల్గొనాలనే ఉత్కంఠ మాత్రం కలిగింది- ఉంది.
గాంధి ఆశ్రమంలో భార్యను కలుసుకొనుట
వార్థాలో గాంధిని కల్సుకున్నాడు. జయప్రకాశ్ , ఏడేండ్లుగా (ప్రభావతి సబర్మతిలోనే ఉంటూ సత్ప్రవ ర్తనతో అందరి ఆనందాన్ని పోందగలిగింది. మహా త్ముడే ఆమెను తన కూతురుగా భావించాడు.
జయప్రకాశను గాంధీ ఆదరించాడు. ఇతడు భక్తితో బాపూజీ పాదాలకు నమస్కరించాడు. ప్రభావతి భర్త పాదాలకు ప్రణమిల్లింది. 'వార్ధానుంచి” కాం గెస్ సభలకు లాహోర్ వెళ్ళాడు జయప్రకాశ్ గాంధీజీ వెంట.
ఆ సమా'వేశానికి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ . 31 డిసెంబర్ 1929 అర్థరాాతి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సంపూర్ణ స్వరాజ్యం తమ లక్ష్యంగా_ ఇదే స్వరాజ్య దినంగానూ ప్రకటించాడు నె(హూ-మరో ఇరవై ఎనిమిచేండ్లకు' (1947) కానీ అది సిద్ధించలేదు.
ఆ సందర్బంలో ప్రజల ,నాయకుల ఆవేశాన్నిచూసి, 'దేశ స్వరాజ్య సాధనకోసం బలికావడానికే నిశ్చయించుకున్నాడు. జయప్రకాశ్ , ఇరువదియేండ్ల యువకుడు, రాగ భోగాలతో సుఖంగా జీవించడానికి ఉత్సాహం చూపించ వలసిన తరుణం, కాని, ఆ యువకునిలో అంతటి త్యాగదీక్ష.
గాంధికి తెలిపిన సొంత కోరిక
మన దేశంలో అమెరికాలోవలె సమాజశాస్త్రం అధ్యయనానికి ఒకే "కేంద్రాం ఏర్పాటు చేయాలనే క్రొ త్తకోరిక జయ్యప్రకాశకు కలిగింది. హిందు విశ్వవిద్యాలయం బనారస్లో ఆ విభాగం లేదు, ఈ విషయంలో గాంధీజితో. సంప్రదించాడు. అందుకు యేబదివేల రూపాయలు వ్యయమౌతుందని తన అంచనా తేలిపాడు. గాంధీజీ అందుకు అంగికరించి మాలవ్యాతో సంప్రదించి, ఆ సంస్థా ఏర్పాటు జరిగేటట్లు చూస్తానని హామీ ఇచ్చాడు.
కాంగ్రేసు సభ్యుల తరువాత జయ్యప్రకాశ్ ను నెహ్రూకు పరిచయం చేశాడు గాంధి, వారిద్దరూ ఒకరి స్వభావానికి ఒకరు ఆకర్షితులై నారు. తన కోరిక గాంధీ వాగ్దానం గూర్చి తెలిపాడు నెహ్రూజీకి జయప్రకాశ్ ,
“ఆ యూనివర్శిటీ గొడప వదిలేసెయి. అభిలభారత కాంగ్రేసు కార్యా లయానికి నడు. అక్కడి పనిచూసుకో.” అన్నాడు నెహ్రూ,
ఆశ్చర్యపడ్డాడు జయప్రకాశ్ ఆ మాటలకు, మొదటి పరిచయంలోనే ఆ నేతకు తనపై ఇంతటి విశ్వాసం కుదిరిసందుకు ఆనందించాడు. అలహాబాద్ చేరి స్వరాజ్యభవన్' లో ప్రవేశించాడు.
నెహ్రూ కుటుంబంతో మైత్రి
కాంగ్రేసు కార్యాలయం స్వరాజ్యభవన్లో జయప్రకాష్ క్రమశిక్షణగా మెదలుతూ రికార్డులు. పేపర్లు చక్కగా భద్రాపరచేవాడు. కార్యక్రమాల సూచికలు, సమా వేశాల విపరాలు సారాంశాలు రాసి పుంచేవాడు. నెహ్రూ మనస్సుకు అతని రాకతో చాల నెమ్మది కలిగింది. (క్రమంగా వారి పరిచయం స్నేహంగా " మారింది. నెహ్రూజీకి జె. పి, తమ్ముడుగా ప్రేమ చూరగొన్నాడు.
ఆ కాలంలో విరామ సమయాల్లో తరచు ఆనంద్భవన్కు వెళ్ళడంతో నెహ్రూ కుటుంబంతో చనువేర్చడింది. వదిస కమలన్మెహ్రూ కోపించి ప్రభావతిని సబర్మతీసుంచి అలహాబాద్ పిలిపించింది. ఆమె గాంధీగారి ఆశ్రమంనుంచి నెహ్రూ ఇంటికే వెళ్ళింది. స్వరాజ్యభవన్లో భర్తతోపాటుగా వుంటున్నా నెహ్రూ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మారిపోయింది.
జయప్రకాశ్ పనికి సంతృప్తుడైన నెహ్రూ జయ ప్రకాశను ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ కార్యదర్శిగా తీసుకున్నాడు.
దండి ఉప్పు సత్యాగ్రహం
13 మార్చి 1930కి సబర్మతీనుంచి ఆరంభమయిన గాంధీజీ కాంగైసు ఉప్పు సత్యాగ్రహం, (9 ఏప్రిల్ నాటికి దండిలో ఊపునందుకుంది. ఉప్పుపై పన్ను "పెంచిన కారణంగా ఆంగ్ల (ప్రభుత్వాన్ని ఉల్లంఘించి, స్వయంగా ఉప్పు తయారు చేయడం దాని ధ్యేయం, శాసనోల్లంఘన మన్నమాట,
దానితో దేశమంతా సంచలనం చెందింది. ఆంగ్ల పభుత్వం కలత చెందిందికంపించింది. పోలీసు లాఠీ చార్జీలు-తుపాకి కాల్పులు పెరిగినై, ఆ సంఖ్యలో సత్యాగ్రహులను అరెస్టుచేసి జైళ్ళను నింపారు. ప్రజా ఆందోళన చూసి వైస్రాయి ఇర్విన్ గాంధీతో సమావేశం జరిపి సంప్రదింపులు గావించా కాంగైసు పార్టీపై విధించిన రద్దు తొలగించబడింది. 1930 రౌండ్ టేబుల్ సమా 'వేశానికి గాంధీని లండన్కు రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ వ్యవహార మంతటికి కార్యనిర్వాకుడుగా జయప్రకాష్ స్వయంగాపాలు పెంచుకొన్నాడు.
మాతృ వియోగం
జన్మభూమి దాస్యబంధాలు తెగచేసే ప్రయత్నంలో పరిశ్రమిస్తున్న ఆ కాలంలోనే జయప్రకాశ్ జనని పూలరాణి మరణదశలోఉన్నట్లు కబురంది పరుగెత్తాడు. కొడుకు సేవకు ఆమె నోచుకోలేదు. పుత్రుని చూడటం కోసమే ఆమె ఇన్నాళ్ళు ప్రయత్నంగా (ప్రాణాలను కనుగుళ్ళలో నిలుపుకొని వున్నట్లుగా నీరసించి వుంది. (పేమతో తనయుని తనివి తీరా చూసి తలనిమిరి ఆ తల్లి శాశ్వతంగా కళ్ళుమూసింది. పసిపిల్లవాడుగా వెక్కి వెక్కి యేడ్చాడు జయప్రకాష్, విధి విధానంగా మాతృమూర్తి దహనసంస్కారం కావించాడు.
అతని తండ్రి మనోవ్యధతో (కుంగిపోయి మంచంపట్టాడు. అశక్తతకు తోడు వృధప్యం , సకివియోగం పైగా అప్పుల బాధ, తల్లి . మరణవ్యయంతో పాటు తండ్రి వైద్యం ఖర్చులు, కుటుంబ నిర్వహణ రుణభారం జయప్రకాష్ పై పడినై అనుభవం లేదు, ఇన్నాళ్ళు ఇంటికి దూరంగా వున్నాడు. ఇప్పుడు తానే పెద్దదిక్కు తప్పించుకోలేని పరిస్థితి.
గాంధీజీకి తన విషయం నివేదించాడు. ఉద్యోగం చూడాలన్నాడు. గాంధీజీ బిర్లాకు చెప్పాడు. పిలానీ కాలేజీలో లెక్చరర్ పోస్టు జయ్మప్రకాష్కు ఇవ్వ వల్సిందిగా కోరాడు. జె.పి, విద్యా వినయ సంపదను నిజాయితీని గూర్చి విని చూసి' తన పర్సనల్ "సెక్రటరీగా ఉద్యోగం ఇచ్చాడు బిర్లా,
అంతా రెండు మాసాలు గడిచేసరికి గాంధీ-ఇర్విన్ ఒప్పందం వల్ల కాంగైసు నాయకులు జైళ్ళనుంచి విముక్తి పోందారు. పార్టీ పని పెరిగింది నెహ్రూజీ జయప్రకాష్ను మళ్ళీ స్వరాజ్యభవన్ కే పిలిచాడు.
ఆ దశలోనే 1930లో “అపూర్వ సత్యాగ్రహం” పేర కాంగైసు చరిత్రను ప్రశంసాపాత్రంగా రచించాడు.
బండిజీవితం
ఆ సత్యాగ్రహ పోరాటాల సందర్భంలో కాంగ్రేసు నాయకులతో పాటు ; జయ ప్రకాశ్ కూడా బందీ అయినాడు. జైలు జీవితం మామూలే, ప్రతీదానికి ఇబ్బందిగా వుండేది. అక్కడ కైదీల పరిస్థితి సౌకర్యాల మెరుగుపడడం కోసం కమినిస్టులతో కలిసి నిరసన వ్రతాలుచేసి సాధించుకున్నారు. అక్కడా ఊరికే కూడా లేదు, పరిసరాల పరిస్థితుల పరిశీలిస్తూ భావి కార్యనిర్ణయాల గురించీబంధుమిత్రు లకు ఉత్తరాలు వ్రాసేవాడు. 'దేశ భవిష్యత్తునుగూర్చి ఆలోచించేవాడు.
భార్యకు వాసిన ఈ లేఖలోని విశేషాంశాలు చూడండి, నిన్నటి రాత్రి రెండు ఉత్తరాలు పంపించాను. ఆ ఉత్తరాలు నీకు చేరినట్లైతే విషయం నీ ఉత్తరంలో సూచించమని అందులో వ్రాశాను.
బబునీ ఇంట్లో అందరు బాగున్నారా? మురార్లో ఇంకా డాల్టన్ గంజ్ కూడా బాగా వున్నారా?
ఖండవాలో నీ ఉత్తరం చేరింది. అందులో నా లేఖలు నీకు గుర్తూ లేకపోవటం కొంత బాధకల్గింది. విచారిస్తే ఆ వ్యక్తి నీకు ఉత్తరాలు ఇచ్చే వాడేనని తెల్సింది. అతను భయపడ్డాడు. దాన్ని నీకివ్వక తన వద్దే వుంచు కున్నాడు. బెదిరిస్తే నాకు ఆ ఉత్తరం వాపసు ఇచ్చాడు. అందుకే నిన్ను నేను తిరిగి పిలిపించాను. ఈ ఉత్తరం తీసుకొని బొంబాయి వెళ్ళాలి. అందులోని సూచన (ప్రకారం పురుషో త్తంను నాకు ఉత్తరం వ్రాయమని చెప్పు. ఆ విషయ, నేను నా ఉ త్తరాల్లో తెలిపాను. నువ్వుకూడా ఆ పద్ధతిని అర్థం చేసుకో.
ఏదైనా ఓ పాతపు స్తకం మందపుది తీసుకో, దానిపై అట్టలు కూడ మందంగా వుండాలి. కవర్ అట్ట చీల్చు. దానిలోపల నీ లేఖనువుంచి తిరిగి చక్కగా అతికించి నాకు పంపించు. బసావన్ ఇంకా ఇతర మిత్రులను కూడా అలాగే చేయ మను_వారేమైనా వార్తలు నాకు పంపదలిస్తే.
రెండు మూడు ఇతర పుస్తకాలతో పాటు [ప్రేంచంద్ నవలకూడా ఒకటి పంపించు దానిలోనే ఉత్తరం పెట్టు. ఒకవేళ ఇతర పుస్తకాల్లో లేఖ పంపితే దాని లోని 100 పేజీకింద 'పెన్సిల్తో...గుర్తుపెట్టాలి. నేను ఆ గుర్తున్న పుస్తకం కవర్నే చించి దాన్ని తీసుకుంటాను.
బసావన్ను ఇక అండ గ్రౌండ్కు వెళ్ళి రహస్య పార్టీకి నవయువకులను చేర్చుకొమ్మను. దీనికోసం పాత పద్ధతుల్లోనే డబ్బు "సేకరించుకోవాలి. దానికి వేరు మార్గంలేదు. శుక్లాగారుకూడా నా సలహాను ఇష్టపడతారు. రహస్య సంఘం కాంగ్రెస సోషలిస్టుపార్టీకి వేరుగా ఉండదు. కాని దాని పేరు వేరే పెట్టవచ్చు.
గంగాబాబు చేశాన్ని విడిచి విదేశాలకు వెళ్ళే పోగ్రాం వీలుకాకపోతే కనీసం అఖిలభారత సంఘ సంయుక్త కార్యదర్శి స్థాయిలోనైనా పనిచేయమను. ఆయన దేశపర్యటన కావించాలి. ఆఫీసు పనికూడా నిర్వహించాలి.
మేం ఇక్కడ నాలుగురోజుల నిరహారదీక్షకు పూనుకున్నాం. ఆ విషయ చర్చ మన ఉత్తరంలో కావించాను. బొంబాయిలో దాని కాపిని తీసుకొని నీవెంట బాపూజీ దగ్గరికి తీసుకెళ్ళు. దానికి సంబంధించి ఈ ఉత్తరంలో మూడు కాగితాలు ఉన్నవి. వీటి నకళ్ళు నీ వెంట తీసుకెళ్ళు.
ఎన్. ఎం, జోషి ఎన్. ఎం. ఏ ఇక్కడికి వచ్చారు. మేమతనికి అన్నీ వాసి ఇచ్చాం. ఆయనను కలవమని పురుషో త్తంకు చెప్పు. నా లేఖ కాపికూడా గాంధీజీ దగ్గరికి తీసుకురావాలను. ఒకవేళ పురుషోత్తం దాని కాపీ యివ్వడానికి ఇష్టపడకపోతే భాపూజీ అతనికి వ్రాసి తేప్పించుకుంటారు.
నేనీ ఉత్తరం నీకిస్తానని తీసుకొచ్చినా ఇవ్వళేకపోయాను . అందుకే దీన్ని అదే మనిషిద్వారా పంపిస్తున్నాను. ఒకవేళ ఈ ఉత్తరం నీకు దొరికివుంటే రేపు నీవు నన్ను కల్సుకోవటానికి వచ్చినప్పుడు “రాత్రి నాకు తలనొప్పిగా ఉంది”అను నీకు నాచిట్టి చేరిందని (గ్రహిస్తాను.
నీవు గఫార్ఖాన్ సాహెబును వార్ధాలో కల్సుకోగల్లితే హజార్ జిల్లా కాంగైసుకమీటి అధ్యక్షుడు “హకీఅబ్ద్బుల్ " సలాంసాబ్”ను ఇక్కడ వేరే క్యాంపులో ఉంచారని చెప్పు. ఆయన ఆరోగ్యం బాగుంది. కాని ఆయన చేతుల ఈ నొప్పులు, ఖాన్సాహెబును ఇతనిక్కడ బాగానేఉన్నట్లు దయతో సలాంగారింట్లో కబురందించుమను ఖాన్ సాహెబు ఉత్తరాలు వారింటిలో రెండుమూడు వారాల తర్వాత అందుతున్నట్లు ఫిర్యాదుచేస్తున్నాడు. వాటి "సెన్సార్ ఇక్కడ అయితే అవుతూనే ఉంది. సరిహద్దు సి.ఐ డి, లు కూడా సెన్సార్ చేస్తారు. అందుకే అంత సమయం తీసుకుంటుంది. డానికి బదులుగా సరిహద్దు ఉత్తరాల్లోని విషయాల టీకా టిప్పణీలు తీసి చేయాలి. అతనికి సరిహద్దులోని ఏ వార్తాపత్రిక కూడా చదువు కోవ టానికి దొరుకుతూ లేదని మరొక ఆరోపణ, ఒకవేళ ఖాన్గారిని నువ్వు కలవక పోతే బాపూజీద్వారా ఒక పత్రం అతనికి పంపించు, " -
ఇది ఆయన 'దేవలీ క్యాంపు జైల్లో వుండగా వ్రాశాడు. సతి ప్రభావతి తనను చూడటానికి వచ్చినప్పుడు ఇవ్వాలనుకునీ ఇవ్వలేకపోయాడు, వేరే వ్యక్తి తో బయటకు పంపిస్తే దారిలోనే పట్టుబడింది.
భారత ఆంగ్ల (ప్రభుత్వం దీన్ని "పెద్ధ ఆర్భాటంతో దాదాపు సమాచార పత్రికలన్నింటిలో ప్రకటించింది. అనేక భాషల్లో రేడియో ప్రసారాలు (ప్రపంచ మంతటాచేసింది. భారత విప్లవకారులలో జయప్రకాశ్ ను నంబర్ 1 అని నిరూపించే ప్రయత్నం చేసింది.
గాంధీజీకి లేఖ
(ప్రియబాపూజీ
చరణాలకు సాదరపూర్వక ప్రణామాలు !
మీరు దయతో వ్రాసిన ఉత్తరం (పభద్యారా అదే సమయంలో అందింది, ఇంతవరకు నేను జవాబు వ్రాయలేక పోయినందుకు విచారిస్తున్నాను. క్షమించ ప్రార్దన,
లాహోరునుంచి నేను పంపించిన ఉత్తరం మీకు చేరిందో లేదో అని నేను ప్రభతో అన్నాను. ఆమె మీకు ఉత్తరం వ్రాయించే శ్రమ, కల్లించినందుకు విచారిస్తు న్నాను, అయినా మీ లేఖ అంది ధన్యుడయినాను,
ఇది నిజం, కొన్ని ఆలోచనా రంగాలలో నేను మీకు సంపూర్ణంగా సన్ని హితుడనయినాను. అది నాకు చాల ఆనందదాయకం. అలాగే కొన్ని మౌలిక సిద్ధాంతాలలో ఈనాటికీ నేను మీకు అంతే దూరంలో ఉన్నందుకు విచారిస్తున్నాను. అది ఎప్పుడూ ఉన్నవే , కాని కార్యరంగంలోనయితే నా మార్గం మీకు దూరం మాత్రమేకాదు, సదా వేరుగానూ వుంటుంది. ఇటు ఎన్ని సంఘటనలు జరిగాయో ఆ కారణంగా నేను అధిక వేగాన్నే పుంజుకున్నాను. కానీండి. మీరు వ్రాసినట్లు జైలు లోపల బయటి ఆలోచనలలో సాధారణింగా భేదం వుండనే వుంటుంది.
ఈ జైలు మనుషులుండగల స్థానంకాదు. అయినా నేను నా విడుదల దినంకోసం రోజులు లెక్కపెడుతూ లేనని, ఒక మహాయజ్ఞం చేస్తున్నట్లు భావిస్తు న్నానని విశ్వసనీయంగా చెప్తున్నాను.
క్రాంతికారులలో కొందరు మరణించడం, కొందరు సర్వస్వం కోల్పోవడం, కొందరు కారాగారాల్లో మగ్గిపోవడం తప్పదు. దీనికి ఏ విధమైన అనుమానమూ అక్కర్లేదు, ఇప్పటికే వేలమంది జై ళ్ళలో వున్నారు! ఇకముందుకూడా వేలాది మనుషులు బంధింపబడుతారు. ఇప్పుడు మా ఉద్యానవసంలోని వర్షాకాలపు పూల వాడిన ముఖాలపై ముసలి ముడతలు పడినాయి. వాటి స్టానం ఆక్రమించడానికి శీతరుతు పుష్పాంకు రాలు మట్టిపొరలలోంచి తొంగిచూస్తున్నాయి. వాని భావినిర్మాణంకోసం ఇప్పుడు ఈ సమయంలోని చాల భాగం వేచ్చిస్తున్నాను. ఈ కల్పనతోనే ఈ నా చిన్నారి ప్రపంచంలో ఏ మూల ఏ పూవు వికసిస్తుందో తన నవ్వుతో ఏ భూభాగాన్ని కప్పు తుందో. నా కల్చనలకు ఫలరూపాన్న్నే చూస్తాననే విశ్వాసాన్ని పరిస్థితులు కల్చిస్తు న్నవి, దీనివల్ల ఆనందాన్నే అనుభవిస్తున్నాను. ఎందుకంటే తన పరిశ్రమ నిష్పలమైపోవడం సాధారణంగా ఏ మానవులకూ అంగీకారంకాదు.
ఈ నా వాగడంతో కొంత మనోరంజకత్వం కలగవచ్చు మీకు, ఐనా ఉత్తరం పెద్దగా అయినందుకు క్షమాపణ కోరుతున్నాను. ఈ పత్రానికి జవాబు ' వ్రాసే శ్రమ మీరు పెట్టుకోకుంటేనే నేను సంతోషిస్తాను.
బొంబాయిలో మీరు జ్వరపడ్డారని తెలిసి దుఖం కలిగింది. ఇప్పటికి మీ ఆరోగ్యం కుదుటపడి వుంటుందని ఆశిస్తాను. సర్దార్పటేల్ గారి చరణాలకు నా నమస్కారం. ఆయన ఆరోగ్యం మెరుగవుతున్నట్లు వార్తాపత్రికలలో చదివి సంతస మయింది. త్వరలో పూర్తిగా బాగవుతారనే ఆశవుంది.
ప్రభ గత మాసంలో 15, 16 లకు వచ్చింది. ఈ మాసం చివరలో మళ్లీ వస్తుందనే ఆశ వుంది . మీ జయ ప్రకాళ్, ఇందులో జె, పి. తన ఆలోచనలు గాంధీ భావాలకు భిన్నంగా వుంటున్నట్లు స్పష్టంగా అంగీకరించారు. ఇక పూల పరంగా కవిత్వంవల్ల వర్ణించింది. ఉద్యమంలో వృద్దుల స్థానాన్ని యువకులు ఆక్రమిస్తారని చెప్పడం.
” భావ్యప్రకటనలో దాపరికం, మోమాటం ఆయనకు నచ్చవు. నీతిగా నిజాయితీగా నిర్భయంగా మెదలటం ఆయనకు ఇష్టం.
అమెరికా సైనికులకు లేఖ (సంక ప్తం)
హింనూస్థాన్లోని ఒక మూలనుంచి
మిత్రులారా,
నేను మా దేశం తర్వాత అన్నిటికంటే ఎక్కువగా అమెరికాను (మీ దేశాన్ని) ప్రేమిస్తాను కనుకనే ఈ ఉత్తరం వాస్తున్నాను. అక్కడ నా జీవితం లోని అందమైన ఏడేండ్ల కాలం గడిచింది. విద్యార్థిగా మీ దేశంవచ్చి అక్కడి విశ్వవిద్యాలయాల్లోనే కాక, పోలాల్లో శిక్షణ పొందాను. నా చదువు ఖర్చుకోసం కూలీపని చేసాను. కాలిఫోర్నియా, ఇఓవా, విస్కొంసిన్ యూనివర్శిటీల్లో చదువుతూ ఓహియోనుంచి ఉపకారవేతనం సైతం పొందాను. మీలో ఆ విద్యాకేంద్రాలలో ' చదివిన వారుండవచ్చును; సోదరులుగా వారికి నాఅభివందనాలు. | మీ "సేవలో ఈ లేఖ ఎందుకు పంపుతున్నానంటే నేనూ మీవలేనే, స్వాతంత్ర పిపాసిని. దానికొరకు మీరు మీ (ప్రాణాల్ని త్యజించడానికి సిద్ధపడు తుంటారు. కాబట్టి, ఒక సమాజ (సామ్య) వాదిగా నేనిది ' (వ్రాస్తున్నాను సమాజ, వాదం వల్లనే యుద్ధాలు సమూలంగా పెకిలించి వేయబడతాయి... దానివల్లనే స్వాతంత్ర పరిరక్షణ జరుగుతుందని నా విశ్వాసం. " మరో విషయం. మీకు తెల్సు. ఆంగ్ల స్వామాజ్యవాదులు హజారీబాగ్, కారాగారంలో నన్ను బంధించారు. అవకాశం లభించినప్పుడు ప్రతి యుద్ద ఖైదీ శతృపంజరంనుంచి తప్పించుకొని పారిపోయే అధికారముంటుంది. ఇప్పుడిప్పుడే, ఆ అధికారాన్ని వినియోగించుకొని బయటపడ్డాను. దానివల్లనే స్వాతంత్య పోరాటంలో భాగస్వామిని కాగలిగాను, ఆంగ్లేయ స్వామాజ్యవాదులు మా దేశశత్రువులు. నన్ను పట్టిచ్చినవారికి బారీ బహుమతులు (ప్రకటించారు. నేనేం ఘోర అపరాధం చేయలేదు! న్యాయాన్ని వంచించిలేదు.
ఒకవేళ ఏ కుయుక్తివల్ల నయినా మీలో యెవరయినా శత్రువులతో యుద్ద బందీలు కావించబడి, అవకాశాన్ని చూసి తప్పించుకొనివస్తే. నిస్సందేహంగా మిరే అతన్ని వీరుడని అంగీకరిస్తారు. అర్చిస్తారు. నేను నన్ను వీరుడనిపించుకొనే
కోరికతో లేను . అపరాధినీ కాను, తన దేశ విముక్తికోసం [శమించే ఒక మామూలు సేవకునిగా భావించుకుంటాను.
ఇప్పుడు ప్రపంచంలో అనేకులు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. రేడియోలో వ్యాఖ్యానింపబడుతున్న 'స్వేచ్చ అనే శబ్దం నాకు ఆధర్శవంత మైంది కాదు, అది భ్రమకారి అర్థ హీనమయిందిగా తోస్తుంది,
స్వతంత్రం అనే శబ్ధం నా ముందొక ప్రత్యేక రూపంతో వుంది. నా దేశం విముక్తిపోందాల. కోట్లాది నా దేశ వాసులకు ఆంగ్లేయులు తగిలించిన సంకెళ్ళు తొలగిపోవాలి!”
మీరు స్వతం త్ర దేశ సైనికులు, కాలవశాన మా 'దేశానికి చాల సమీపానికి వచ్చారు. అందుకని మీరు మా స్వాతం త్య పోరాట (ప్రాధాన్యతను అర్ధంచేసుకొని మా ఉద్యోగులకు సహకరించాలి.
నాగరికుల అసత్య ప్రచారాల గూర్చి మీకు చక్కగా తెల్సు, డా॥ గోబెల్స్ అసత్య ప్రచారమూర్చిగా మారాడు. స్యామాజ్యవాద అసత్యాలకు గురు వులు చర్చిల్, హైలిఫక్స్, ఎవరీ, ఇంకా ఆంగ్లేయులు వారి అనుయాయులు,
భారతదేశం గురించి మీముందుకు రెండు అసత్యాలు వచ్చివుంటాయి,
ఆంగ్లేయుల భారతీయులకు స్వరాజ్య శిక్షణ ఇవ్వటానికే ఇండియాలో ఉన్నారట, మేము యోగ్యులం కాగానే వేళ్ళిపోతారట. అందుకు హిందూ దేశంలోని అందరూ ఒక్కటి కావాలట,
ఇదో "పెద్ద అసత్య ప్రచారం గొప్పవాళ్ళ నోటనే మేమీ మాటలు వింటున్నాం. కవిత్వాలు, కథలు, సాహిత్యం, విజ్ఞానం యీ అసత్యాలకే పవిత్రతకే
ముద్ర వేస్తున్నది. ఉదారులైన ఆంగ్లేయులు కూడా ఈ భావాలనుండి. విముక్తి పోందుతూ లేరు. సామ్రాజ్యవాదం వెంట పరుగుదీస్తూ వాళ్ళు మాకు స్వరాజ్య శిక్షణ ఇస్తా రనటం ఒక పేలాపన మాత్రమే. సామ్రాజ్యవాదం దోపిడీ కోసం జరుగుతుందని మీకు తెలుసు. నా దేశాన్ని ఆంగ్లేయులు ఎలా లూటీ చేసిందీ, ఎలా నెత్తురు పీల్చి పిప్పి చేసింది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
హిందూ'దేశం అంగ్ల బానిసత్వం పోందకముందే ఒక స్వతంత్రం 'దేశం స్వరాజ్య శిక్షణ మరే 'దేశంనుండీ పోందే అవసరం దీనికిలేదు. కానయితే ఇక్కడ అంతర్గత కలహాలుండేవి. అదే వారి మాటలకు కారణమైతే, ఐరోపా దానిచుట్టు (ప్రక్కల ద్వీపాల రాజ్యాలు స్వరాజ్య శిక్షణ పోందటం అవసరం, ఎందుకంటే అవి ఎప్పుడూ పోరాడుకుంటూ రక్తపాతం కావిస్తున్నాయి.
ఆంగ్ల అబద్ధీకులవి రెండు విధాల రూపాలు. భారతదేశంలోని ఎన్నో ప్రాంతాల్లో దేశీయుల పరిపాలన వుందంటారు. కాని స్వపరిపాలకులకేపాటి విలువ వుందో, ఈ మధ్యనే సింధూ ప్రధానమంత్రి శ్రీ అల్లాబక్షిని గవర్నర్ డిస్మిస్ చేశారు.
ఆయస దోషం ఖాన్ బహద్ధూర్ భరణాన్ని (ప్రభుత్వానికి వాపసుచేశాడు. దేశంలోని పద్ధతి (ప్రకారం తన అసమ్మతి తెలిపాడు. కేవలం ఈ అపరాధానికే గవర్నర్ అలా చేయడమా.అంత అధికారమా? ప్రజా (ప్రతినిధుల విశ్వాసం హిందిన ఒక ప్రధాన మంత్రిని అలా తొలగిస్తాడా? ఇంతేకాక. బెంగాల్ లోని ఒక పెద్ద సుబాలో ఒక మంత్రి డా॥ శ్యాంప్రసాద్ ముఖర్జీ తన పనిలో అడుగడుగున గవర్నర్ జోక్యాం కల్పించుకోవడంవల్ల పదవికి రాజీనామా ఇచ్చాడు. ఈ (ప్రాంతీయ పరిపాలనలు డొంక తిరుగుడు వ్యవహారాలు,
'దేశంలో ఐకమత్యం కనిసించగానే స్వరాజ్యం ఒప్పగిస్తామని ఆంగ్లే యులంటున్నారే - బెంగాల్, సింధూల్లో ఏకత వుంది కదా
అక్కడి మంత్రి మండలిలో అన్ని పార్టీల వ్యక్తులున్నారు. వ్యతిరేక పార్టీ ఉందంటే (ప్రజాస్వామ్య పరిరక్షణకు అలా ఉండవల్సిందే. మరి ఆ ప్రాంతాల్లో స్వపరిపాలన ఏందుకు నడవనియలేదు.
నాకు నమ్మకం.వారికి మా దేశం వేడలి పోవాలని "లేదు. ఇదీ పరిస్థితి. సమస్త భారతీయులు వారికి వ్యతీరేకమే.కాంగ్రెస్ మరియు మా సోషలిస్టు పార్టీ. పాశవిక అవినీతి విధానాలకు విరోధుల మని పచే పదే చెప్పారు. ఈ [ప్రపంచ మహాయుద్ధం ఆరంభానికి చాల ముందు నుంచే, చాల ప్రజాతంత్రాలు తమ స్థానాలను ఎన్నిక చేసుకోవటానికి ముందే , "దేశీయ సామ్యవాద భారత్ సంస్థ, [పజాతంత్ర స్పెయిన్కు యింకా చాంగ్ శై షేక్ 'చీనా (ప్రజాస్వామ్యానికి తమ మద్దతును చాటింది. జర్మన్, ఇటలీ, జపానులను వ్యతిరేకించింది. ఒకవేళ భారతదేశం స్వతంత్ర పొందితే ఈ అంతర్జాతీయ' కల్లోలంలో దీనిది బలమైన పాత్ర వుంటుంది. దీని జోక్యంవల్ల ఈ (ద్వితీయ) (ప్రపంచయుద్ధం ఆగకున్నా ఆసియాలో మాత్రం వ్యాపించదు. స్వతంత్ర భారత్ చీనా కల్సి ఏ దురాక్రమణ వాంఛగల 'దేశాన్నయినా భయపెట్టగల్లుతాయి. ఈ రెండు దేశాలు కల్సి పనిచేసే వీలు కలిగితే ఈ కాలపు చరిత్ర మరో తీరుగా వ్రాయబడుతుంది. అందుచేత స్వతంత సైనికులయిన మిమ్ము నేను మా స్వతంత్ర పోరాటానికి సహకరించవల్సిందిగా కోరుతున్నాను. మూడువిధాలుగా మీ సహాయం అందించవచ్చును.
మొదటిది, మాకు విరోధంగా ఫాసిస్టు పోరాటం ఆరంభించిన ఆంగ్లేయుల ద్యుష్ప్రచారాలకు దూరంగా ఉండండి. దౌర్జన్య విషయాలలో ఆంగ్లేయులకు సహక రించవద్దనే మీకు మీ ప్రభుత్వం ఆచేశించిందని విన్నాను.
రెండవది ,మీరు మీ దేశ ప్రజలకు, నాయకులకు, ప్రభుత్వానికి భారత. 'దేశ సంబంధంతో సత్యసమాచారాన్ని , పంచి సలహాలను ఇవ్వండి. మీరు మా మధ్యలో ఉన్నారు. కనుక మా 'దేశంగురించి అధికార పూర్వక సమాచారం ఇవ్వ వచ్చును. మీ దేశ సానుభూతిని "స్నేహాన్ని మాకు కలిగించి సహకరించవచ్చును.
ఇక మీతో కాగల మూడవ సహకారం-ఆంగ్లేయ సైనికులకు అధికారులకు కూడా భారతదేశాన్ని గూర్చి సరియైన సమాచారాన్ని అందించండి. వారు మంచి వీరులు సత్య విషయాలు వారిముందు. పెడితే మా ఉద్దేశ్యాలను న్యాయంగా గ్రహించడానికి వారు వెనుకాడరు. ఇప్పుడు వారి మససుల్లో తప్పుడు అవగాహన, హిందూదేశం యెడల తెలియనితనం ద్వేషం నిండి వున్నాయి. అందుకే వారు మాకు హానిచేస్తూ తమ ఆదర్శాలకే భంగం కల్లించుకుంటున్నారు. ఆంగ్ల సైనికుల అనేక శ్రమజీవుల కుటుంబాలనుంచే వస్తారు. వాళ్ళు కూడా సామ్రాజ్యవాద పీడితులను వ్యతిరేకించేవారే . వాళ్ళ ఉద్దేశ్యం మావి వేర్వేరు కావనే సత్యాన్ని (గ్రహించాలి వాళ్ళు.
ఎందాక ఈ స్యామాజ్యవాదం భంగంకాదో, నశించదో అందాక ఆంగ్ల జనం పీడన దారిద్యం తొలగిపోవు. ఇంగ్లాండులో కూడా ప్రపంచ యుద్ధానంతరం కొత్త సామాజిక వ్యవస్థను రూహిందించుకోవాలనే చర్చ ఘనంగా సాగుతున్నది. ఆంగ్ల సైనికుల ఆ భవిష్యత్తు మీద నాకు ప్రగాఢ విశ్వాసముంది.
అందుకే మీరు ఆంగ్ల సైనికులకు చెప్పండి. ఒకవేళ వారు ఒక నూతన మైన మంచి ప్రపంచాన్ని ఎక్కడ ధనం అవసరం, బలం.మర్యాద, శిక్షణ. సంస్కృతి యిలాంటి జీవితపు ఉత్తమ సాధనాలు అందరికి పంపకం అయ్యేది.
రూపోందించుకోవాలనుకుంటే వారు చేస్తున్న పెద్ద తప్పు. స్వాతంత్ర కోసం త్మీప్రంగా పోరాడుతున్న ఆసియావంటి 'పెద్దఖండంలో ఫాసిస్టు ధోరణిలో కుదిపి వేయడం_బాలురపై స్త్రీలపై గుండ్లవర్షం కురిపిస్తూ, దేశ భక్తుల ఇండ్లను లూఠీచేస్తూ కాలుస్తూ తిరగడం, మా పోరాటం వారితో కాదని చెప్పండి. వారికి ఏ హానీ కలిగిం చాలని లేదు. ఆంగ్ల ప్రజలపై మాకు చెడుభావంలేదు. మా యుద్ధం ఆంగ్ల ప్రభుత్వం మీద, మేం దాన్ని నష్ట పెట్టడంలో లీనమై ఉన్నాం. ఎందుకంటే అది మా స్వేచ్చకు, ఆనందానికి అభివృద్ధికి శత్రువు. మీరు వారితో ఇదీ చెప్పండి. మేం తప్పక స్వతంత్రులమౌతాం, అప్పుడు వారి భుజాలతో భుజాలు కలిపి (పపంచంలోని.అన్ని దౌర్జన్యాలను పశుప్రవృత్తులను దూరం చేయడానికి పోరాడుదాం. అప్పుడే మన మందరం కల్సి ఒక క్రొత్త ప్రపంచం స్వరూపాన్ని రూపొందించుకోగలం వారిని చక్కగా అలోచించుకోమనండి. ఒకవేళ వారు తమ పాలకుల దుష్ట్రచారాల నమ్మి. పోరాడితే వారి వీరత్వం వ్యర్థమే అవుతుంది. ఎందుకంటే వారి సంతానానికి విష పూరిత ప్రపంచమే లభిస్తుంది. అక్కడ అత్యాచారాలు, వై షమ్యాలు, దారిద్రం , బాధలు, యుద్ధాలు ఉంటాయి. ఇంకా మారణాయుధాల స్పర్ధ-పోటీ ఉంటాయి.
మిత్రులారా.ఇదే మీకు నా సంక్షిప్త విజ్ఞాపన, ఇది మీ మనసుల్లో స్థానం పోందుతుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. స్వాతంత్రయానికి జయము!
భారత విప్లవానికి జయము!!!
మీ. జయ్యప్రకాశ్ నారాయణ్.
ఈ లేఖలో జయ్యప్రకాశ్ గారికి ప్రపంచ రాజకీయాలపట్ల అవగాహన, ప్రపంచయుద్దాల యెడల స్పందన. నవసమాజ నిర్మాణ కాంక్ష, భారత స్వాతంత్ర పోరాట దీక్ష ఎలా ఉందీ తెలుస్తున్నది.
జైలునుంచి పరారీ
'దేవలీ, లాహోర్, హజారీబాగ్ జైళ్ళలోకి జయ్యపకాశను మార్చారు ఎన్నో యాతనలకు గురిచేశారు, అయినా ఎటువంటి సమాచారమూ పోందలేక పోయారు. ఆయన గుండెదైర్యం సంకల్చం బలమైనవి.
కందుకమువోళే సుజనుడు,
క్రిందబడి మగుడ మీదికిన్నెగయు సుమీ!
మందుడు మృత్పిండమువలె
(కిందబడి యణగియుండు గృపణత్వమునన్.
(బంతిని నేలకు కొడితే పైకెగిరినట్లు బుద్ధిమంతుడు, మట్టిముద్దపడి అణిగి ఉన్నట్లు మూర్గుడు.)
మణి రాపిడిలోనే [ప్రకాశించునట్లు మంచివారు కష్టాలలోనే రాణిస్తారు. 1940లో హజారీబాగ్ నుండి జయప్రకాశ్ తప్పించుకొని పారిపోవడం ఇంగ్లీషువారిని చకితుల చేసింది. రాజకీయ ఖై దీ కనుక ఈయనను అక్కడ పిల్లల వార్డులో ఉంచారు, 1930లో డా॥ రాజేం[దప్రసాద్. 1932లో సరిహద్దు గాంధి ఖాన్ అబ్దుల్ గఫార్ కూడా అక్కడే బందీలుగా ఉంచబడ్డారు.
ఆగష్టు విప్లవఛాయలు ఆ జైలులోనికి ప్రవేశించాయి. ఆ పోరాట కాలంలో జయ్యప్రకాశ్ జీ జై లుగోడల చూస్తూ “ఏమిటి నేనీ రాతిగోడల మధ్యనే పడి ఉండాలా?” నావాళ్ళు స్వాతంత్యంకోసం పోరాడుతున్నారు. నేనేమో...” అనుకునేవాడు. ఆయన రక్తం ఉ(దేకంతో ఉడికిపోయేది. ఉత్సాహం పోంగు లెత్తేది. పరిగెత్తు కెళ్ళి విప్లవకారుల్లో కల్సి ఉద్యమించాలనే కోరిక బలంగా కలిగేది,
బహుముఖ (ప్రజ్ఞాశాలి అయిన జయప్రకాశ్ పారిపోవటానికి పథకం ఆలోచించుకున్నాడు. దసరానాడు అందరూ పండుగ వేడుకల్లో ఉండగా రిహార్సల్ కూడా చేసుకున్నాడు. జైలు గదుల తలుపులు, ఎప్పటివరకు తేరచిఉండేది, సిబ్బంది ఎప్పుడెప్పుడు వచ్చి వేళ్ళేది గమనించాడు. మిత్రులతో సమాలోచన జరి పాడు" సైయన్న వారిని కూడ గలుపుకున్నాడు.
దీపావళి వచ్చింది. జైలు ఖైదీలు ఉద్యోగులు బాణాసంచా కాలుస్తూ కోలాహలంగా ఉండగా_
“పరుగిడిపో ఓ పక్షి. నీ దేశం” అనే పాట వినవచ్చింది.
అది ఒక మి(త్రుని సంకేతం, అదే మంచి సమయమని అయిదుగురు సహచరులతో పాటు “భలాంగ్' మని ప్రహరి గోడపై కెగిరి బయటకు దూకాడు. రాళ్ళు ముళ్ళు ఉన్నాయని కాళ్ళు విరుగుతాయేమోననే భయంలేదు. ' ఒక్కటే ధ్యేయం పారిపోవడం. ఒక్కటే గమ్యం పోరాటం-స్వరాజ్యం!
ముందు. వెనుకల చూశేదిలేదు. బాగోగులు ఆలోచించేది లేదు, పరుగు.పరుగు,..రాళ్ళు కాళ్ళను, ముళ్ళు ఒళ్లును. తాకినా రక్కినా రక్తాన్ని కార్చినా ఒక్కటే పరుగు రాత్రంతా. ఉదయం వరకు సురక్షిత |పాంతానికి ఓ మారుమూల గ్రామానికి చేరి శ్వాస తీసుకున్నారు. అప్పుడిక (గ్రామీణ రైతుల వేషాలతో ఎండ్లబండ్లపై వెళ్ళారు.
అటు హజారీబాగ్లో జైలర్కు సెంట్రీలకు కంపరమెత్తిం ది. ఉరు కులు పరుగులు. లాభంలేదు. పట్టుకున్న వారికి బహుమతులు ప్రకటించారు 21 వేలు.
జయవకాశ్ నారాయన్ ను పట్టినవారికి 5 వేలు
యోగానందశుక్లా ” “
రామానందమిశ్రా ” “
నారాయణ్ సింహ్ 2 వేలు
గులాచంద్ “
శాలీ గ్రాం సింహ్ “
ఆనాడు తప్పించుకొని వెళ్ళిన సాహసికులు ఆరుగురు, ఆసందంతో చప్పట్లు చరిచిన (ప్రజలు నలుబదికోట్లు,
ఆగష్టు విప్లవ మార్గదర్శి
1921 గాంధీ సత్యాగ్రహం దేశాన్ని ' పెద్ద పూపుఊపి “చౌరాచౌరి?” హింస సంఘటనతో ఆపివేయబడింది. అప్పుడు 30 వేల సత్యా[గ్రహులు జయిళ్ళపాలయ్యారు.
1923లో వేరుపడి స్వతంతపార్టికి స్టాపించినా 1928 లో మోతీలాల్ నెహ్రూ కలకత్తా కాంగైసు సభల కధ్యక్షత వహించాడు.
1929 లాహోరు సభలకు జపహర్ లాల్ అధ్యక్షుడు. అప్పుడే గాంధీతో పాటు వెళ్ళిన జయప్రకాశ్ కునెహ్రూకు పరిచయం కలిగింది.
1930 దండి ఉప్పుసత్యా(గ్రహంలో కాం(గైసు నాయకులు తిరిగి అరస్ట య్యారు.
1930 మొదటి రౌండు టేబల్ సమావేశానికి కాం గెసువాళ్ళు వెళ్ళ కున్నా 1931 రా. టే. స, కి గాంధీజీ పాల్గొన్నారు. ప్రయోజనం శూన్యం.
1931 ఫి[్రపరిలో అజాద్చం[ద్రశేఖర్, మార్చిలో భగత్సింగ్, సుఖ "దేవ్, రాజగురులు (ఉరితో) అమరులయినారు.
1931 ఏప్రిల్ చిటకాంగ్ ఆయుధాల దోపిడి మిలటరీ హింసాకాండ.
1932 కాంగ్రెసు సహాయనిరాకరణ ఉద్యమంలో బంధీకావింపబడినవారు 20 వేల 1934లో అతివాద కాంగ్రెసు ఎన్నికల రంగంలో (ప్రవేశించి కేంద్ర ములో 85 స్థానాలు గెలిచింది. సభకు తిరిగి నెహ్రూ అధ్యక్షుడు, ఆ యేడే కమలా నెహ్రూ మరణించటం జరిగింది. విదేశీసంచారంతోస్పూర్తి పోందిన కమ్యూనిస్టు భావాలతో నెహ్రూ, గాంధీని వ్యతిరేకించినా చివరికి ఆయన మాటలను అంగీకరించేవాడు. తస నూతన భావాలకు సన్నిహితం కాబట్టి సోషలిస్టులయిన జయప్రకాశ్ , నరేంద్ర దేవ్, అచ్యులబట్వర్థన్లను సభ్యులుగా తీసుకున్నాడు. సరోజినీచేవిని కూడా కాదన్నాడు. ఆ సభలో ఆ నలుగురిదొకదారి. కాంగ్రేసు వర్కింగ్ కమిటీది నచ్చ లేదు, కాబట్టి గాంధీ ఆయన ఆనుచరులు పదిమందిది మరోదారి. బంధీఖానాలో వున్నాడు కాని పచ్చిపుంటే సుబాసుబాబుది మూడవ దారిగా వుండేది,
స 1937లో రాష్ట్రాల ఎన్నికలలో పాల్గొని 1585 సీట్లలో 711 గెలిచి 7 రాష్ట్రాలలో మితవాద కాం్మగైసు మంత్రివర్గాల నేర్పించారు.
8 ఆగష్టు 1939న కాం[గైసు. (ప్రభుత్వంతో. విచారించకనే ఓ [ప్రభుత్వం భారత'సేనలను రెండవ ప్రపంచయుద్ధంలో దింపి తూర్చు దేశలకు పంపింది. దానికి నిరసనంగా కాం[గెసు (ప్రభుత్వం ప్రతినిధులు రాజీనామాచేశారు
1940లో వ్యక్తి సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు గాంధీజీ మళ్లీ జాతీయ నాయకుల అరుస్టుల పర్వం ఆరంభమయింది.
అటు జర్మన్ ఇటు జపాన్ బ్రిటిష్వారిని మట్టుపెట్టడానికి కది భారతదేశం సైతం ఉడుకెక్కింది.
1942లో క్లిప్స్ రాయబారాన్ని ఇంగ్లాండు ఇండియాకు అహింసావాది గాంధీకే నచ్చలేదు.
“క్విట్ ఇండియా” కాంగ్రెస్ తీర్మానమయింది.. బొంబాయి. 8 ఆగస్టు 1942 గాంధీ-నెహ్రూ [ప్రముఖ నాయకులందరూ బందీలయ్యారు. అలజడి ఆరంభమైంది. విప్లవకారులు ముందుకు దూకారు.
పనుల్లో, గనుల్లో, కార్ఖానాల్లో, గ్రామాల్లో, నగరాల్లో బ్రిటిష్ దొర మూకలపై తిరగబడ్డారు, తెల్లపులులను పిల్లుల చేశారు. ఉత్తర బీహార్, బెంగాల్ మిడ్నపూర్,' సంయుక్త రాష్ట్రాల్లో (యు. పి) స్వతంత్ర పాలన నెలకొలా భారత విప్లవకారులు. టేలిఫోన్ తీగెలు తెగాయి. రైలుపట్టాలు తొలిగాయని వార్తలు. రైళ్ళు నిలిచిపోయాయి. అది ఉప్పెన_.జన ప్రభంజనం!
3 మాసాల ఈ అలజడిలో 318 పోలీస్స్టేషన్లు, 252 పోస్టాఫీసులు ధ్వంసమై, 3 లక్షల 50 వేలరూపాయల నష్టం ఆంగ్ల ప్రభుత్వానికయింధి అదంతా ఎవరి సొమ్ము? ఇండియాను దోచింది. ఉద్యమం చల్లార్చడానికి ర్ 538 సార్లు కాల్పులు జరిపి 1028 మందిని చంపి3215మందిని గాయపరచి, 60229 మందిని అరెస్టు చేసినట్లు (ప్రభుత్వ ప్రకటన, నిజం ఇంకా ఎంత ఎక్కువోమరి,
చావోరేవో తేల్చుకోవలసిన సమయం వచ్చింది అనిగాంధీజీ అరెస్టుకు ముందు వ్రాసి పెట్టుకున్న కాగితం ఇంతటి విప్లవానికి కారణమయింది.
ఈ ఆగస్టు విప్లవాన్ని రహస్యంగా ఉంటూ వీరోచితంగా నడిపిన నాయకుడు మన జయప్రకాశ్ , ఆయన తోడుగా వేలు లక్షల వీరులు.వీరనారులు 'దేశపౌరులు నిలిచారు.
ఈ తిరుగుబాటులో ఆంగ్లేయులు కాల్చిచంపినవారు. 40 వేలకు తక్కు వగా ఉండరని జయ(ప్రకాశ్ అంచనా 10 వేలు మరణించారని “డిస్కవరీ ఆఫ్ ఇండియా'లో నెహ్రూ పేర్కొన్నాడు.
9 నవంబర్ 1942న జైలునుంచి తప్పుకొన్న జయప్రకాష్ ఆగస్టు విష్లప సారధ్యం వహించి రహస్యంగా దేశమంతటా సంచరించాడు.
ఢిల్లీనుండి రావల్సిండి వెళ్ళుతుండగా అమృతసర్ స్టేషన్లో ఫ్రంటియర్ రైల్లో తిరిగి అరెస్టు చెయ్యబడ్డాడు.
ఆ దినం తేదీ 18 సెప్టెంబర్ 1943 . ఆ 'దేశ నాయకుని లాహోర్ఖిల్లా జైల్లో బంధించి ఎన్నో కేసులు నడిపింది ప్రభుత్వం, ప్రజలు తమ (క్రాంతి నాయకుని “భారత లెనిన్” అని పిలిచారు అభిమానంతో,
“నేను ఆయన వీరతను గౌరవిస్తాను” అని జయప్రకాశ్ కు గాంధీజీ ప్రశంసించాడు తాను శాంతివాది అయినా.
మనం పోరాటం తుది ఘట్టం పూర్తి స్వరూపాన్ని మనసు నందుంచు కొని, మనల్ని సంఘటిత పర్చుకోవాలి. రాబోవు యుద్ధానికి సిద్ధపడుతూ కాంతి "సేనను సుశిక్షితులుగా, దీక్షాపరులుగా తయారు చేసుకోవాలి. కేవలం అలజడి మన లక్ష్యం కాదు. పూర్తి ఐనతరువతా ఒకేసారి తిరగబడాలి__అనేది లక్ష్యం.
ప్రతి తాలూకా. మరియు తానాలో, కార్ఖానాలో మరియు ఉద్యోగ "కేంద్రాల్లో నవయువకులను ఇలాగే పోరాట "సేనగా "తయారు. చేయాలి. వారు రాబోయే తిరుగుబాటులో మానసికంగా వస్తు రూపేణా, శారీరకంగానూ సహక రించడానికి సిద్ధంగా వుండాలి.
పైగా మనం భారత "సేనలో, ఇతర ఉద్యోగాల్లో పనిచేయాలి. (ప్రచార ప్రదర్శనల కార్యం వుంది. బళ్ళల్లో, కళాకాలల్లో, బజార్లలో కూడా పని వుంది. 'దేశీయ సంస్థానాల్లో (3 ,4 వందలు) మరియు సరిహద్దుల్లోనూ మనం నిలవాలి, ఇది నా వల్ల సాధ్యం అయ్యేది కాదు. అన్ని ఏర్పాట్లను ఇక్కడనుంచి చూడలేను. మనం ఎంత చేసినా ఇంకా చేయాల్సి వుంది. ఇంకా ఇంకా చేయాలి.
మిత్రులారా! చివరిమాట. నేను మరో మారు తిరిగి మీ మధ్యకు వచ్చి నా "సేవలను మీకు సమర్పించే అభిమానాన్ని, సంతృప్తిని అనుభవిస్తున్నానని చెప్పడానికి అనందిస్తున్నా. మీ సేవ చేస్తే మన నాయకుల “చేయండి లేదా చావండి అనే నినాదం నిజమవుతుంది. ఇంక మీ ఆజ్ఞాపాలనమే ఏకై క సంతోషం నాకు, హిందూస్థాన్ ఒక మూలనుంచి. -జయపకాశ్ నారాయణ్.
కాం[గెసుతో సంబంధం
గాంధీని గురువుగా భావించాడు, నెహ్రూను బంధువుగా అభిమానిం చాడు, కాం[గైసు కార్యాలయంలో పనిచేశాడు, సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొ న్నాడు. కాని కాంగైసుపై ఏనాడూ పూర్తిగా విశ్వాసం, ఆశ లేవు జయపకాశకు,
1946 జూలై మాసాన బొంబాయిలో జవహర్లాల్ న్యెహూజీ కాంగ్రెస్ కార్యకర్తగా చేరమన్నప్పుడు జయ్యప్రకాశ్ ఒప్పుకోలేదు. అందుకు ఆయన చూపిన కారణాలు ఆయన మాటల్లో.
“భారత ప్రభుత్వంలో కాంగ్రెస్ , ఏనాడూ దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడని ఎలాంటి త్యాగం చేయని వాళ్ళను తీసుకుంది” అది తనకు నచ్చకేదు. అందుకే కాంగ్రేసులో చేరలేనని ఖచ్చితంగా చెప్పేశాడు.
అదే నవంబర్లో నెహ్రూ తిరిగి కాంగ్రెసుకు ఆహ్వానించాడు. ఒత్తిడి "సైతం చేశాడు. కాని అప్పటికే జయ్యప్రకాశ్ , డా॥ లోహియా కార్యవర్గ సభ్యు డయ్యాడు.
“దేశ సమగ్రత కంటే . కాంగ్రేసువారికి (పభుత్వ అధికారమే ప్రియంగా వుంది” అని భావించాడు. గాంధీకి సైతం ఇష్టంగా లేదా విషయం, కాంగ్రెసు ప్రభుత్వ రంగంలో ఎన్నికలకు నిలవడం, రాం మనోహర్ లోహియా, జయప్రకాశ్ ఇద్దరూ కాంగైసుతో తెగతెంపులు చేసుకున్నారు.
స్వరాజ్యం వచ్చింది 15 ఆగస్టు 1947. దేశ విభజన జరిగి స్వతంత ఇండియా సమగ్రంగా కాక భారత్-పాకిస్తాన్ రెండు చేశాలుగా రూపొందడం చూసి జయప్రకాష్ కలతచెందాడు.
1948 జనవరి 30 నాడు గాంధీజీ హత్య జరిగింది. ఇది జయప్రకాశ్ కు చాల దుఃఖాన్ని కలిగించింది.
కాంగ్రేసుతో వేరుపడి సోషలిస్టువాదులు 1948 మార్చిలో కొత్తపార్టీని ఏర్చరచుకున్నారు. దానికి జనరల్ సె[క్రటరీ జె. పీ. కేవలం 1986లో కొన్ని మాసాలు మ్యాతమే కాం[గైసుపార్టీ మెంబర్గా, కార్యకర్తగా పనిశాడాయన.
స్వతంత్రం తర్వాత
నెహూజీ కోరినా కాంగైసులో చేరలేదు. ఏ పదవీనీ. ఆశించలేదు. లోహియాతో సామ్యవాద పార్టీ (సోషలిస్టు) స్థాపించాడు.
1952 ఎన్నికల్లో కాంగైసుతో పోటీపడి వీరి పార్టీ ఘోర పరాజయం పోందింది. దాని కారణంగా పరస్పర నిందలతో, అంత:కలహాలు _చెలరేగాయి. వాటిని రూపుమాపి పార్టీ బలాన్ని కాపాడాలని జయ్మపకాశ్ 2 జూన్ 52 నుంచి ఉపవాస (వతం పూనాడు. వరుసగా మూడు వారాలు (21 రోజులు) ఉపవసించి, పదిహేడు పౌనుల బరువు తగ్గినా అయస ముఖకాంతి, గొంతు స్వరం ధీప్తి వంత మైందే కాని తరుగలేదు.
ఆ పార్టీ అంతంత మాత్రంగానే నిలిచింది. కాంగైసుకు. (ప్రతిపక్షంగా కమ్యూనిస్టుపార్టీ (ప్రాబల్యం ముందు వెనకకు తగ్గింది.
సోషలిస్టు నాయకుడుగానే కాక సర్వోదయ నాయకునీగా జయప్రకాష్ నారాయణ్కు మంచి "పేరుంది. సమాజ శేయస్సు తప్ప స్వార్థ చింతనలేని సాధు ఆయన, చంబల్ లోయ బందిపోటు దొంగలను అహింసామార్గంలో మార్చి (ప్రభు త్వానికి పట్టి ఇవ్వడం ఆయన జీవితంలోని ఒక అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది. [ప్రజలు (ప్రశంసించారు.
ఛలో ఢిల్లీ
18 మార్చి 75 నాటికి వీహార్ ఆందోళన మొదలయి సంపత నాటినుంచి జనతా ప్రభుత్వాన్ని ఊరూరా స్థాపించాలని నిర్ణయించారు. నుంచి 31 జూలై మూడుమాసాల కాలాన్ని అందుకోసం జయ్యప్రకాశ్ కేటాయిం చాడు.
ఉద్యమం పట్నాలనుంచి పళ్లైలకు విస్తరించింది. “జైలు స్వరాజ్యం వచ్చింది. జై లునుంచే మీకు అధికారాలు ప్రాప్తిస్తాయి. ప్ర అధికారాలు లభించడమేకాక మంచి స్వచ్చమైన స్వతంత్రం సిద్ధిస్తుంది” అని జై ,ఉద్బోద .
కాళరాత్రికి కిరణాలు
12 జూన్ 75, ఇందిరా ప్రధాని ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు వఢింది. అదేరోజు గుజరాత్లో కాంగైన్ ఓడింది.
24 జూన్న ఇందిరాగాంధి ఆప్పీల్ పై కృష్ణయ్యర్ తీర్చు గత తీర్మ నాన్నే బలపరచింది ప్రధాలిగ వైదిగాలి. దిగక పోతే చేయవలసిన కార్యక్రమం గూర్చి [ప్రతిపక్షాల నాయకులు మొరార్జీ ఇంట్లో సమావేశమైనారు. జె.పి, ఆ సమా వేశంలో వున్నా 25న పాట్నా వెళ్ళవల్సి వుంది. మిత్రుల కోరికగా ఆ రోజు ఆగి 26 నాడు వెళ్ళాలనుకున్నాడు.
29 నాడు ఇందిరాగాంధి నివాస భవనం ముందు ధర్నా జరపాలని నిర్ణ యం జరిగింది. అంతకి సంతృప్తి చెందక జె.పి. సత్యాగ్రహుల సంఖ్య అడిగాడు, 15 వేల మందిని వాటాల వారిగా లేక్క చెప్పారు ప్రతిపక్షాల నాయకులు...”
ఈ విషయమంతా గూఢచారులతో ప్రధానికి చేరింది, ఆమె ఆలోచనలు
వేరుగా పయనిస్తున్నాయి. 1975 జూన్ 25 సాయంత్రం ఢిల్లీ రాంలీలా మైదానంలొ జేపి ఇలా గర్జించాడు .
ఇది భారతదేశం ఇక్కడ నియంతృత్వం సాగదు . అలాంటివారిని దేశం సహించదు (రాజ్యాంగాన్ని మార్చి అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం,
పతికలపై సెన్సార్ ఏక పక్ష పరిపాలన నియంతృత్వానికి చిహ్నాళేకదా నేను రాజ
ద్రోహం చేస్తున్నానని శ్రీమతి గాంధి భావిస్తే ఆమెకు నాపై కేసునడిపే "సేచ్చా
వుంది. ఆమె తన కేసు సందర్భంలో 27 సార్లు అబద్ధాలాడిన విషయం మీరు మరచి
పోకండి. అంటే 15 నిముషాలకొక అసత్యం! తననూ అలాగ అసత్య ఆరోపణ
లతో నిందస్తుందని చెప్పడం.
ఆ రాతి 8 గం॥లకు ర్యాష్రపతి ఫకురుద్దీన్ను కలసి ప్రధాని ఇందిరా గాంధి ఎమర్టెన్సీకి ప్లాను వేయటం జరిగింది. వెంట సిదార్ద శంకర్రే ఉన్నాడు, 11 గం॥ హోం మినిష్టర్ (బ్రహ్మానందరెడ్డి పిలువబడ్డాడు. నిర్ణయం విన్నాడు. మరో అధికారి పదకొండున్నరకు ఎమర్జెన్సీ కాగితంపై రాష్ట్రపతి సంతకం చేయించి తెచ్చాడు.
అర్థర్యాతి ఆవరించింది. కాళరాత్రి , ఆ ప్రముఖ పత్రం పై తేదీ వేయ బడక పోవడం వింత, రా|తి ఏం జరిగిందనేది [ప్రముఖ మంత్రివర్యులకు కూడా తెలియదు. ఉదయం ఐదు గంటలకు మంత్రి మండలి సమావేశం జరిపి అమోద ముద్ర వేసారు.
కారాగారానికి నడిచాడు
రాత్రి సభానంతరం తొమ్మిది గంటలకు “గాంధీ ప్రతిష్టాన్'లోని తన శిబిరానికి వెళ్ళాడు జయప్రకాశ్. ఆయస అలసటను ఉత్సాహం కప్పివేసింది. ప్రయాణాలు, సమా వేశాలు, సమాలోచనలు కొన్ని వారాలుగా విశ్రాంతి "లేకుండా వుంది. అయినా (ప్రభుత్వాన్ని గద్ధేదించగలమనే జనశక్తి సన్నాహం సంతృ ప్తిని కలిగించింది. ఉదయం పాట్నా వెళ్ళటానికి విమానం టికెట్టు రిజర్వు అయివుంది.
జనశక్తి ని సరిగా అంచనా వేయలేక విరోధినాయకులు ఉద్యమంలో చేరటానికి పూర్తి అంగీకారం తెల్పకపోవటం విచారంగా వుంది. రావటమా వదా అని తటపటాయిస్తున్న జగజీవన్రాం కాంగ్రేసు మంత్రి దగ్గరికి చందశేఖర్ను పంపాడు.
పదకొండువరకు చూసి నిద్రపోయాడు.. జె . పి. అర్థరాత్రి అరెస్టు వారెంట్తో పోలీసాఫీసర్ వచ్చాడు. జె .పి మిత్రుడు రాధాకృష్ణ, కొడుకు చంద్రహార్ పిలవగా వచ్చి కాగితం చూశాడు. సుశీల్కుమార్ సంతకంతో వుంది. స్తబ్దుడయ్యాడు. మొదట వారిని కొంచెం నిద్రపోనీండిఅని కోరాడు రాధాకృష్ణ, టేలిఫోన్ ఆపరేటర్ను పిలిచి బొంబాయి, బెంగులూరు, మద్రాసు, పాట్నా, ఢిల్లీ వీలైనన్నిచోట్లకు తమవారికి ఈ సమాచారం వెంటనే తెలియజేయమన్నాడు.
దాదాపు 2 గం॥ అనంతరం 3 గం॥ వేళకు పోలీస్ ఆఫీసర్ ఒత్తిడితో లోకనాయక్ను లేపి వారెంట్ చూపారు.
“క్షమించండి. మిమ్మల్ని వెంటనే తీసుకురావాల్సిందిగా ఆర్థర్” అన్నా డతడు, జె. పి. మౌనంగా లేచి సిద్ధమయ్యాడు.
ఒక కప్పు టీ తాగి వేళ్ళండి-అన్నాడు. రాధాకృష్ణ, చంద్రశేఖర్ రావచ్చునని అతని ఆశ. రాజ్ నారాయణ్ అప్పటికే బందీ అయ్యాడు.
వాకిట్లో మూడు లారీల నిండుగా పోలీసులు వేచివున్నారు. జయప్రకాష్ వెళ్ళి (ట్రక్కులో కూర్చున్నాడు. అప్పుడే టాక్సీలో దిగిన చంద్రశేఖర్ జ. పి.ని చూసి నమస్కరించాడు. ట్రక్కు కదిలింది. దానివెనక కారులో రాధాకృష్ణ, చంద్ర శేఖర్ వెళ్ళారు.
పార్లమెంట్ వీథి పోలీస్స్టేషన్ కు చేరుకున్నారు. ఎస్. పి, ఇతర ఆఫీసర్లతో వచ్చి జె, పి, ని చూసి వెళ్ళాడు. ఫోన్పై వార్త వ్యాపించి కొందరు విలేకరులూ వచ్చారు.
“మీరు గిరఫ్తార్ అయినారు” అన్నాడు చంద్రశేఖర్, ఆశ్చర్యపడ్డాడు జయ(ప్రకాశ్ , తర్వాతి కథ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
“23 జూన్ నాడు. నేను పాట్నానుంచి ఢిల్లీ వెళ్ళాను. అక్కడే 26 ఉదయం దాదాపు మూడుగంటల 'వేళ “గాంధీ ప్రతిష్టాన్'లో నా విడిదిలో అరేస్టు చేయబడ్డాను. ఢిల్లీనుంచి హరియానాలోని సౌహనా (ప్రదేశానికి నన్ను కారులో తీసు కేళ్ళారు, అక్కడ రెస్ట్ హౌస్ లో వుంచారు. సౌహనా చేరితేనే శ్రీ మొరార్జీ 'దేశాయిని అరెస్టుచేసి తీసుకురావటం నేను చూశాను. మేము అదే భవనంలో వేరు వేరు గదుల్లో వుంచబడ్డాం వారితో నా కలయిక కాళేదు.ఒకేచోట వున్నప్పటికి కూడా, కనీసం భోజన సమయంలోనైనా మమ్ము కల్సుకోనివ్వండని మా కాపలా పోలీసు అధికారిని కోరాను. ఈ అభ్యర్థననుకూడా ఆయన అంగీకరించ లేదు.”
రెండురోజుల తర్వాత జూలై మొదటి తేదీ ఎయిర్ఫోర్స్ విమానంలో చండీగఢ్ తీసుకెళ్ళారు. విడుదల దినం 12 సవంబర్ 1975 వరకు అక్కడి హాస్పిటల్ గదిలోనే బందీగా వుంచారు.
ప్రధానికి లేఖలు
పోలీసు మిలటరీ దళాలను తిరుగబడమని జయప్రకాశ్ (ప్రభుత్వ ద్రోహానికి పూనుకున్నట్లు (ప్రధాని ప్రసంగాల్లో ఆరోపణ వుంది. అది విని “సత్య మేవ జయతే” సూక్తిని ఆదర్శంగా స్వీకరించిన మన పభుత్వ విధానం ఇదా అనుకున్నాడు 27 జూలై 75 నాడు ప్రధానికి "పెద్ద లేఖవాస్తూ అందులో ఇల ప్రశ్నించాడు. “ప్రధాని అన్నట్లుగా నా [ప్రయత్నం అదే అయితే, గత ఉప (ప్రధాని మొరార్జీ 'దేశాయి, కాంగైను కార్యసమితి సభ్యుడు చంద్రశేఖర్ కూడా అందులో భాగ స్వాములా? వారెందుకు బందీలయ్యారు?”. ఆ తర్వాత ఈ పుస్తకం 4వ పేజీలోని అంశాలున్నవి-స్వవిషయాలు తర్వాత వున్నవి.
“మీకు తెల్సు. నేను ముసలివాడనై నాను. నా జీవితకార్యం "పూర్తయింది. ప్రభ మరణించిన తర్వాత నేను జీవించి వుండవలసిన అవసరమేమీ లేదు, చదువు ముగించిన తర్వాత నేను నా పూర్తి జీవితాన్ని 'దేశానికే అర్పించాను. దానికి బదులుగా నా కోసమని ఏదీ కావాలని కోరలేదు. అందువలన మీ రాజ్యపాలనల్లో బందీగా నేను సంతోషంగా మరణించగలను,
చివరగా ఒక్కమాట_మీరు మిమ్మల్నే దేశమని భావించకండి... మీరు అమరులుకారు. భారతదేశం అమరం, ఒకవేళ మంతిత్వ స్థాయిలో అవినీతిని అంతం చేయాలనుకుంటే , (ప్రతిపక్షాలను కూడా విశ్వసించి, వారి సలహాలను అంగీ కరించడానికి పూనుకుంటే , మీకు మా అందరి సహాయం లభిస్తుంది. దానికోసం మీరు (ప్రజాస్వామ్యాన్నే నష్టపరచవలసిన పనిళేదు-నిర్ణయం మీది.”
ఈ జె. పి. లేఖ ప్రధానికి చేరిందో లేదో తెలియదు కాని జవాబుమాత్రం రాళేదు,
మరో లేఖ తేది 27-8.75 నాడు (వ్రాసారిలా,
“ప్రధానమంత్రి - న్యూఢిల్లీ,
పాట్నా బీహార్ పరిస్థితులకు నాకు చాల దుఃఖం కలిగింది. పాట్నాలో ఇంత కష్టం ఇంతకు పూర్వం ఎప్పుడూ జరగళేవనడానికి చరిత్ర సాక్ష్యం , నేనిచ్చట నిస్సహాయంగా పడివున్నాను. ఒక్క. నెల పెరోల్ మీద నన్ను విడిచి పెట్ట వల్సిందిగా మిమ్ము ప్రార్థిస్తున్నాను. "నేను బీహార్ మరియు ఇతర రాష్ట్రాల పజలను, కేంద్ర (ప్రభుత్వాన్ని కల్సి సహాయాన్ని అందించిపస్తాను. ఒకవేళ ఆ అలజడి తగ్గకపోతే వేరే ప్రయత్నం చాల చేయవల్సి వుంటుంది . 1934 బీహార్ భూకంపం సంద ర్బంలో. బ్రిటిష్ (పభుత్వం రాజేం[దప్రసాద్ను అలాగే విడిచిపుచ్చింది. సత్వరం ఈ విషయంపై ధ్యానముంచి నన్ను వదలి పెట్టపలసిందిగా ప్రార్ధన.”
జె. పి. ని వదలలేదు, స్వదేశీ ప్రభుత్వం, ప్రజా సంక్షేమంకంటే (ప్రభుత్వ భవత ముఖ్యం మనవాళ్ళకు. అంగబలం ఆర్థబలం అధికారబలం సమృద్దిగావున్న ఒక సువిశాలదేశ ప్రజాస్వామ్యానికి ఒక వృద్ధ నిస్వార్థ ప్రజా నాయకుడంటే అంత భయం!
పిడిత ప్రజల్లో తిరుగుబాటుతప్పదు. నియంతృత్వప్రభుత్వాలకు పతనం తప్పలేదు, అనేది దాచినా దగని సత్యం.
ప్రధానమంత్రి ఉత్తరాన్ని నేను తిరిగి చదివాను. ఒకరీతిగా అది ెటేలి ఫోన్ భాషలోవుంది. రెండుసార్లు చదివితే అర్థమైన విషయం ఏమిటంటే, నేను సహాయకార్యాల వరకే పరిమితం కావాలని స్పష్టంగావుంది. ఆ మాటలతో తెలిసే 'దేమంటే నేను రాష్ట్ర మరియు కేంద (ప్రభుత్వాలకు సహకరించాలని,
నా అభ్యిపాయాన్ని ఢిల్లీలో [ప్రధానికి నా అభ్యర్థనపై విచారణ కాక
పూర్వమే అందజేస్తే కృతజ్ఞుడను, మీ జయప్రకాశ్ నారాయణ్.”
మూత)పిండాలు చెడిపోయాయి
అదే విచిత్రం . అంతవరకూ వృద్ధాప్యంవల్ల, అవిరామ పరిశ్రమల వల్ల అనారోగ్యం పాలవుతున్నా ఏనాడూ మ్యూతపిండాల వ్యాధిలేదు, బందీగా వున్న హాస్పిటల్లో డాక్టర్లయినా ఈ విషయం సూచన చేయలేదు, ఒకనాడు అకస్మా త్తుగా జయపకాశ్ మూత్రపిండాలు రెండూ పూర్తిగా చెడిపోయినట్లు చెప్పారు. ఇంత అకస్మాత్తుగా ఇలా ఎలా జరిగిందనేది ఆయనకూ ఎంతమాత్రం అర్థంకాలేదు. అదీ విడుదలకు కేవలం ఒకవారం ముందుగా అయిదు నవంబర్న తెలిపారు.
ప్రత్యేక వైద్య చికిత్సతో పాటు రక్తశుభ్రతకు కృతిమ మిషన్ అవసర మయింది.
జస్టోక్ ఆస్పతి? చికిత్స
జయ్యపకాేశ్ ను ఆయన కోరికగా బొంబాయి జస్లోక్ ఆస్పృతిలో చేర్చారు. అక్కడి డాక్టర్లు [శ్రద్ధగా చికిత్స చేశారు. ఆయన కోలుకున్నా” తాత్కాలికమే” ,వారానీకి మూడుసార్లు కృత్రిమ యంత్రం ద్వారా శరీరంలోని రక్తాన్నంతా గొట్టం ద్యారా లాగి. శ్యుభ్రపరచి తిరిగి ఎక్కించాలి. అది ఏడుగంటల కార్యక్రమం, కష్టంతో కూడిన ప్రక్రియ.
అయినా ఆశవదలుకొన్న ప్రియతమ నాయకుడు జీవించ గల్గాడు. “మేం మిమ్మల్ని బతికించలేదు. మీ హృదయ బలమే మిమ్ము కాపాడింది” అన్నారు డాక్టర్లు,
“సశ్వేశ్వరుడే నన్నుకాపాడుకున్నాడు” అన్నాడు సర్వోదయ నాయ కుడు.
ఇక ఇంతే, జీవితకాలమంతా ఇలా దవాఖానాలో పడివుండడం జె.పి.కీ నచ్చలేదు. శరీరంలో ఊపిరి వున్నంతవరకు దేశంకోసం (ప్రజలకోసం శ్రమించే స్వభాపం శవజీవితం నచ్చదు. సుఖాసక్తి మొదటినుంచీ లేదు.
ఒక యంత్రాన్ని కొని లోకనాయక్ చికిత్స ఇంటిపద్దనే జరిగే సౌకర్యం కలిగించాలని మిత్రులు నిర్ణయం తీసుకున్నారు. కాని, అది మామూలుగా లభించే వస్తువు కాదు.మూడులక్షల వ్యయం, చందాలద్వారా డబ్బు "సీకరించ నెంచారు.
క్రొత్త పార్టీ అవతరణ
ఎమజన్సీ కాలంలో అతివాద, మితవాద పార్టీలవాళ్ళు అనేకులు అరెస్టు చేయబడి జైళ్ళలో చిత్రహింసల పాలైనారు. అదేరాాత్రి 400 వారెంట్లు వెళ్ళి నయ్. 25 జూన్ 1975 ర్యాలి రూపొందిన అత్యయిక, పరిస్థితి 26 ఉదయం మంత్రిమండలిలో ఆమోదింపబడి పత్రికల కెక్కింది.
పదవీ భయంతో ముందు. జాగ్రత్తగా (ప్రధాని తీసుకున్న కఠినచర్య ప్రజాహిత కార్యక్రమాల (ప్రచార రంగమైంది. ఆమె 20 సూత్ర లతో పాటు కొడుకు సంజయ్ 4 సూత్రాలు సంస్కరణకు పూనుకున్నవి. 3+20=420 అని అపహాస్యంపాలై ఒకసూత్రం పెరిగి 5, 20గా మారినై, "మొదట మేధావులు కూడా ఇది గొప్పమార్పు అని అనుకున్నారు. తర్వాత ఇదా అసలు రహస్యం అని విచారించారు.
సుదీర్గ కాలం సాగిన ఈ ఎమర్జెన్సీని చివరికి ఎత్తి వేయక తప్పలేదు ఏడాదిన్నర కాలానికి.
11 అక్టోబర్ 1977 తస 73వ. జన్కదినోత్సవాన్ని అభిమానుల మధ్య సంతోషంగా గడుపుకున్నాడు.
'దేశంలోని ఆకలి అవిద్య నిరుద్యోగం దారిద్రం అశాంతి అలజడులకు ఆయన మనస్సు నొచ్చుకుంది. దీనికి తగినమార్పు అవసరమని భావించాడు.
జనతా విజయం-పతనం
1977 కేంద ఎన్నికలకు కేవలం రెండున్నర మాసాలకు ముందు ప్రతి ప్రజల కూడలిగా “జనతా పార్టీని జాతీయస్థాయిలో రూపొందింప జేసాడు, జె . పి, కృషి మూలంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించి 90 ఎండ్ల రాజకీయ చరిత్ర గలిగి 30 ఏండ్లు పరిపాలనా పీఠం పైపున్న కాంగ్రేసు పార్టీని చిత్తుగా ఓడించింది.
ఆనాటి జనతా నాయకులు-ఆచార్య కృపాలానీ, అశోక్ మెహతా మొరార్జీదేశాయ్, జగజీవన్ రాం, విజయలక్ష్మి పండిట్, అటల్ బీహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ, . నీలం సంజీవరెడ్డి, [పకాశ్ సింగ్బాదల్ , చరణ్ సింగ్?" హేమవతి -నందన్ బహుగుణ, రాజనారాయణ్, జార్జీ ఫెర్నాండజ్, చంద్రశేఖర్, మొదలగువారు. సినీఫీల్డ్ నుంచి దేవానంద్ కూడా పాల్గొన్నాడు.
మొరార్జి [ప్రధాని అయ్యాడు. ఆంధ్రప్రదేశ్నుంచి గెలిచిన ఒకే ఒక జనతా అభ్యర్థి సంజీవరెడ్డిగారిని రాష్ట్రపతి పదవి వరించింది. ఇది గొప్పమార్పు మనది గొప్ప (ప్రజాస్వామ్యంగా (ప్రపంచ (ప్రశంసలందుకున్నది. కాని, ఈ (పజా స్వామ్యాన్ని గూర్చి జ. పి. అభిప్రాయం.
“అమెరికాలో ఒక విద్యాసంస్థ జరిపిన పరీక్షలో నూటికి 'డెబ్బదిమందికి తమ రాష్ట్రపతి "పేరయినా తెలవదని తేలింది, బీహారు గ్రామాల్లో కృపాలానీ ప్రశ్న లకు జనం జవాబు “జవహర్లాల్నెహ్రూ భారతదేశం రాజు, ఆయన తర్వాత కుమారుడుగద్దెపై కూర్చుంటాడు” అని,
ప్రపంచ ప్రజల పరిస్థితి ఇదీ. పైగా మనం ఓటుద్వారా. ఏర్పడుతున్న మన ప్రజాస్వామ్యం బాగా నడుస్తున్నదని అంటున్నాం. పౌరులకు ఓటుహక్కు ఇస్తేనే ఆదర్శ రాజ్య వ్యవస్థ ఏర్పడిందని నాయకుల అభ్యిపాయంలో పుంది.” ఇంకా ఇలా అన్నాడు.
“రాజనీతియొక్క వికాసం గత శతాబ్దాల్లో ఏదైతే రూపోందిందో అది మానవ సమాజాన్ని ఏ స్థాయికి చేర్చిందో . దౌర్భాగ్యవశాన దానికి మించి మంచి మార్గంలేదని మనం కావిస్తున్నాం. నేడు ముఖ్యంగా ఎన్నికల ప్రజాస్వామ్యం ఏక పక్షపాలన నడుస్తున్నది. వాటికంటే ఉ త్తమ విధానం ఏదైనావుందా , అని ఆలో చించి అటువైపు వెళ్ళటానికి (ప్రయోగం జరపటానికి పూనుకోలేదింకా .
ఎన్నికలు మొదలైన రాజకీయాలకై ఎంత శక్తిని వ్యయిస్తున్నామో అందులో సగభాగమైనా ఈ నూతన మార్గాన్వేషణకై ఖర్చుపెడితే పరిస్థితి వేరుగా మారుతుంది.”
నాయకులలోని మరో లోపాన్ని ఇలా పేర్కొన్నాడు.
“ఒక వ్యక్తి ప్రతిపక్షంలో వున్నంతవరకు చెడ్డవాడే మన దృష్టిలో, ఏ క్షణంగా నై నా అందులోంచి 'వేరయితే చాలు ఆతని విలువ పెరుగుతుంది. పైగా అతన్ని మనపక్షంలో కలుపుకోవటానికి భూమి ఆకాశాలను ఒకటి చేస్తాం. మనవైపు చేరినా ఆ వ్యక్తి గంగాస్నానం చేసి పవిత్రుడై నట్లే , మంచి ఏమిటి? చెడేమిటి? అనే “సంగతి ధ్యాసమాత్రం వుంటూ లేదు.”
ఎన్ని ఆశయాలున్నా ఎన్ని నీతులుబోధించినా జనతాాపభుత్వం రెండేండ్లు మించి గద్దెపై నిలవలేక పోయింది. అందుకు కారణం పదవీ వ్యామోహాలు పాత పార్టీల వాసనలు అంతఃకలహాలు, జనతా ప్రభుత్వం కూలి.పార్టీ చీలి వింతగా చరణ్సింగ్ ప్రధాని అయ్యాడు 23 జూలై 1979 నాడు.కాంగ్రెస్ సహాయంతో.
విధిలేక ఈ కొత్త (ప్రధానికి ఆశీస్సులిచ్చాడు. లోళనాయక్, పాలకులు ఎవరై నా పాలన బాగుంటే చాలు అనే భావన వారిది.
ఇందిరాజాలంతో 24 రోజులకే ఆయన ప్రభుత్వం కూలింది. అయినా ఆపద్ధర్మ ప్రధానిగా ఆరుమాసాలు కొనసాగాడు. జనపరి 80, మధ్యంతర ఎన్ని కల్లో తిరిగి ఇందిరా ప్రభుత్వం నెలకొని జనతా తుడిచి పెట్టుకుపోయింది.
మనిషి మరణించినా ఆలోచనలు ఆదర్నాలు మిగిలి ఉంటాయి
అనారోగ్యంతో. అలసిన దేహానికి, అసంతృప్తితో విసిగిన మనస్సుకు పరిపూర్ణ విశ్రాంతి చేకూర్చటానికో అన్నట్లు జయప్రకాశ్ తన జీవయాత్ర ముగించిన రోజు 8 అక్టోబర్ 1979. గాంధీజీ తిరిగివస్తే ఏమౌను అనడానికి సమాధానంగా “రెండవ గాంధి"గా "పేరు పొందిన జె. పి, అస్తమించాడు.
జనం విలపించారు. అవినీతి, లంచగొండితనం, నిరుద్యోగం, దారి ద్రం . .. లలో నిండిన ఈ దేశ రోగానికి ఏది తగిన జౌషధం అని ఆలోచన మిగిలింది” మేధావులు నిర్లిప్తులు, సామాన్యులు అజ్ఞానులు, మధ్య తరగతివారే వివిధ భావాల మధ్య కొట్టు మిట్టాడుతున్నవాళ్ళు.
ఫలితం జనసత్తా భవిష్యత్తులపై ఆధారపడి వుంటుంది. _మీరు ఎప్పుడు తప్పుడుదారినే ఎన్నుకున్నారు.అన్నవారికి జయ్యపకాశ్ జవాబు ఇలాగుంది.
“నేనెప్పుడూ పదవుల గు్యుర్రపుస్వారీకి పూనుకో లేదు. దేశానికి లేదా జనానికి మార్గదర్శిని కావాలనే కోరిక నాకెప్పుడూ లేదు. ఏ పదవినీ కోరలేదు. ఎంత పెద్ద పదవికానీ నన్ను ఆకర్షించలేదు. 1930 నుంచి ప్రత్యక్షంగా రాజ కీయాల్లో వున్నా ఏనాడు కానీ ఏ పదవికి పోటీ చేయలేదు. నేను కాంగైసులో వున్నప్పుడు ఎన్నికలలో ఇతరుల కోసం ప్రసంగించ 'వేళ్ళేవాడిని. కాంగైసునుంచీ సోషలిస్టు పార్టీ వేరైనప్పుడు అభ్యర్థులకు టికెట్లు పంచే బాధ్యత పార్టీ (ప్రధాన కార్యదర్శిగా నాపై వుండేది. ఇతరులను ఎన్నికల్లో నిలిపాను కాని, నేను పోటీలో నిలవాలనుకో లేదు. అది నా స్వభావం కాదు. మార్క్సిస్టుగా ఉన్నప్పుడు కాని, 1942లో అండర్ గ్రౌండ్ కార్యక్రమం సడిపినప్పుడు కానీ, ఎప్పుడూ నేను అతి వాదిని కాను.”
సర్వోదయ నాయకుడు వినోబాజీని గూర్చి.
వినోబాజీ అహింసా ఉద్యమ ప్రబోధకులు-.మార్గదర్శకులు. ఏ విధ మైన క్రాంతి ఉద్యమం కూడా అవసరం లేకుండానే . రాజకీయ రంగంలో మార్పు సాధ్యమని వారి విశ్వాసం. ఇరువదెండ్లు సర్వోదయ సంస్థ సంబంధంతో జయ ప్రకాశ్ వినోబాజీ భూదాన గ్రామ స్వరాజ్య ఉద్యమం నీరస దశకు చేరుకున్నట్లు గ్రహించాడు. తాము స్థాపించిన గ్రామ జన సంఘర్షణ సమితులు కొన్ని మాసా ల్లోనే మంచి ఫలితాలు సాధించి సజీవంగా వున్నట్లు గమనించాడు._.వినోబా ఆధ్యాత్మిక నై తిక భావాలు సాధు జీవితం కొందరిలో నైతిక మార్పు తేచ్చినప్ప టికీ అదెప్పుడూ సామాజిక మనో వైజ్ఞానిక శక్తి కాజాలక పోయిందని ఆయన అభిప్రాయం.
జె. పి.కలలు కన్న భారతదేశం ఒక ఆదర్శలోకం!
జనసాధన సంపత్తి యావత్తూ నిర్భలుల సేవకు అర్పితమౌతుంది. అక్కడ మానవత కేంద్రంగా వుంటుంది. అంతరాత్మ ప్రేరణ ప్రకారం పనులు. చేసే అధికారం, అందుకు గౌరవం ఉంటవి, విభిన్న భావాలు శాంతియుతంగా చర్చించ బడి, సభ్యరీతిలో పరిష్కరింపబడతాయి.
అక్కడ అందరికీ పని వుంటుంది. ఆ పనిద్వారా సంతోషం, సుందర జీవితం లభిస్తాయి. ప్రతి వ్యక్తికీ తన సృజనాత్మక శక్తిని వికసింపజేసుకునే అవకాశ మంటుంది. కుటీర పరిశ్రమల్లోకాని, కర్మాగారాల్లోకాని యాజమాన్యానికీ, (శమికులకూ సంబంధమూ భాగస్వామ్యమూ వుంటాయి.
ఆ దేశంలో ప్రతి సాధనం ప్రజలకు కూడూ, గుడ్డ, గూడు మరియు నీరు ప్రతి అవసరాన్ని తీర్చడంలో నిమగ్నమై వుంటుంది.
ఆ 'దేశంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, [ప్రజా సేవకులు, వారు మార్గం తప్పితే దండించే అధికారం ప్రజలకుంటుంది.
ఒక సంపూర్ణ ప్రగతిశీల గాంధీవాద స్వాతంత్ర సమరశీల భారతదేశాన్ని రూపొందించటం కోసం ఆయన కలలు కన్నాడు.
అందుకే జయప్రకాశ్ లోకమాన్యుడు ! ధన్యుడు ! !
_ సమాప్తం_